News March 16, 2025

‘పుష్ప-3’ రిలీజ్ అయ్యేది అప్పుడే: నిర్మాత

image

‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ‘రాబిన్ హుడ్’ ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్‌లుగా నిలవగా, ‘పుష్ప-2’ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 31, 2025

సీరియల్ నటి ఆత్మహత్య.. కారణమిదే!

image

సీరియల్ నటి నందిని(26) <<18707144>>ఆత్మహత్య<<>>కు పాల్పడిన ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగు చూసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, నటన అంటే ఇష్టమని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మరణానికి కారణమని తెలిపారు. కాగా నందిని తండ్రి(ప్రభుత్వ ఉద్యోగి) 2023లో మరణించారు. దీంతో ఆ ఉద్యోగం చేయాలని నందినిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు.

News December 31, 2025

అంతిమ యాత్ర తర్వాత వెనక్కి ఎందుకు చూడకూడదు?

image

శరీరం దహనమైనా ఆత్మ ఉనికిలోనే ఉంటుందట. తన కుటుంబంతో ఉన్న అనుబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. గరుడ పురాణం ప్రకారం.. శ్మశానం నుంచి వెనుదిరిగేటప్పుడు వెనక్కి చూస్తే, ఆత్మకు బంధువులపై మమకారం పెరిగి ఈ లోకాన్ని విడిచి వెళ్లడం కష్టమవుతుందని నమ్ముతారు. ఆత్మ తన పాత గుర్తింపు వదిలి కొత్త ప్రయాణం ప్రశాంతంగా మొదలుపెట్టాలనే ఉద్దేశంతోనే, బంధాన్ని తెంచుకుంటూ ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదని అంటారు.

News December 31, 2025

నమో యాప్‌లో ప్రధాని మోదీ ‘2025’ ప్రయాణం

image

ప్రధాని మోదీ 2025 ఏడాదికి సంబంధించిన తన ప్రత్యేక జ్ఞాపకాలను NaMo యాప్‌లో షేర్ చేశారు. పాల్గొన్న కీలక దౌత్య సమావేశాలు, సాంస్కృతిక వేడుకలు, ప్రజలతో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. పుణ్యక్షేత్రాల సందర్శన, సరిహద్దు ప్రాంతాల్లో పర్యటనలు, భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ విశేషాలను ఈ పోస్ట్‌లో వివరించారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సాగిన ఈ ప్రయాణం అద్భుతమని పేర్కొన్నారు.