News July 22, 2024

నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టి..

image

తెలంగాణ ప్రముఖ కవుల్లో ఒకరైన దాశరథి కృష్ణామాచార్య జయంతి నేడు. ఆయన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో 1925 జులై 22న జన్మించి 1987 నవంబర్ 5న మరణించారు. నిజాం అరాచకాలపై తన రచనలను ఎక్కుపెట్టారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ పోరాట జ్వాలలు రగిల్చారు. పలు సినిమాలకూ పాటలు రాశారు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా సాహిత్యరంగంలో కృషిచేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.

Similar News

News December 7, 2025

శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

image

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్‌కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.

News December 7, 2025

ALERT.. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.

News December 7, 2025

సమ్మిట్ ఆహూతులకు స్పెషల్ బొనాంజా

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. 44 దేశాలనుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. రేపు 1.30కు సమ్మిట్‌ను గవర్నర్ ప్రారంభిస్తారు. CM 2.30కు ప్రసంగిస్తారు. TG సంస్కృతి, HYD ఆధునికత ఉట్టిపడేలా ప్రతినిధులకు స్వాగతం, ప్రసిద్ధ వంటకాలతో ఆతిథ్యం అందిస్తారు. సమ్మిట్ ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేక సావనీర్, వివిధ పిండివంటలతో కూడిన బాస్కెట్‌ను ఆహూతులకు అందించనున్నారు.