News July 22, 2024
నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టి..

తెలంగాణ ప్రముఖ కవుల్లో ఒకరైన దాశరథి కృష్ణామాచార్య జయంతి నేడు. ఆయన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో 1925 జులై 22న జన్మించి 1987 నవంబర్ 5న మరణించారు. నిజాం అరాచకాలపై తన రచనలను ఎక్కుపెట్టారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ పోరాట జ్వాలలు రగిల్చారు. పలు సినిమాలకూ పాటలు రాశారు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా సాహిత్యరంగంలో కృషిచేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.
Similar News
News December 10, 2025
కామారెడ్డి జిల్లాలో 20 ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్

కామారెడ్డి జిల్లాలో 20 ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 20 ప్రదేశాల్లో 10°Cల లోపు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 11 ప్రదేశాల్లో 15°Cల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యి. కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో శీతల గాలులు వీస్తూ అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవ్వడంతో ఎక్కడిక్కడ చలి మంటలు కాచుకుంటూ ప్రజలు సేద తీరుతున్నారు.
News December 10, 2025
గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల వైరస్ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


