News July 22, 2024
నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టి..

తెలంగాణ ప్రముఖ కవుల్లో ఒకరైన దాశరథి కృష్ణామాచార్య జయంతి నేడు. ఆయన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో 1925 జులై 22న జన్మించి 1987 నవంబర్ 5న మరణించారు. నిజాం అరాచకాలపై తన రచనలను ఎక్కుపెట్టారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ పోరాట జ్వాలలు రగిల్చారు. పలు సినిమాలకూ పాటలు రాశారు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా సాహిత్యరంగంలో కృషిచేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.
Similar News
News November 15, 2025
DRDOలో 18 అప్రెంటిస్లు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News November 15, 2025
రెండు చోట్ల ఓడిన బిహార్ ‘సింగం’

నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిహార్ ‘సింగం’గా పిలవబడే మాజీ ఐపీఎస్ శివ్దీప్ లాండే ఓటమిపాలయ్యారు. అరారియా, జమాల్పూర్ నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జమాల్పూర్లో జేడీయూ నేత నచికేత మండల్ 96,683 ఓట్లతో, అరారియాలో కాంగ్రెస్ అభ్యర్థి అబిదుర్ రెహ్మాన్ 91,529 ఓట్లతో విజయం సాధించారు. లాండేకు ప్రజాదరణ ఉన్నప్పటికీ దానిని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు.
News November 15, 2025
నిర్మాణాత్మక సంస్కరణలకు సిద్ధం: మంత్రి లోకేశ్

AP: ఏఐ మానవాళికి ముప్పుకాదని, అది హ్యుమానిటీని పెంచుతుందని మంత్రి లోకేశ్ చెప్పారు. CII సదస్సులో ‘AI-భవిష్యత్తులో ఉద్యోగాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. ‘ప్రతి పారిశ్రామిక విప్లవం అధిక ఉద్యోగాలను కల్పిస్తుందికానీ తొలగించదు. IT, ఫుడ్ ప్రాసెసింగ్లో పారిశ్రామికవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. వీరితో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు.


