News December 9, 2024

బాలిక నోట్లో దుస్తులు కుక్కి, పెట్రోల్ పోసి..

image

AP: నంద్యాల(D)లో ఇంటర్ విద్యార్థిని <<14828564>>హతమార్చిన<<>> ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని వెల్దుర్తి(M) కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న దుర్మార్గుడు ఇవాళ తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న బాలిక నోట్లో దుస్తులు కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అక్కడే మృతి చెందింది. అతడు కూడా నిప్పటించుకోగా, పరిస్థితి విషమంగా ఉంది.

Similar News

News September 24, 2025

చంద్రఘంటా అలంకారంలో భ్రమరాంబికాదేవి

image

శ్రీశైల క్షేత్రంలో నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి నేటి సాయంత్రం చంద్రఘంటా దేవి రూపంలో కనిపిస్తారు. సింహ వాహనంపై బంగారు కాంతితో మెరిసిపోతూ పది చేతుల్లో ఖడ్గం, బాణం సహా వివిధ అస్త్రాలు ధరించి, తలపై అర్ధ చంద్రాకారంతో చంద్రఘంటా దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. నవదుర్గల్లో మూడో స్వరూపమైన చంద్రఘంటను దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతీతి.

News September 24, 2025

అక్టోబర్ 1 నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు

image

వచ్చే నెల 1 నుంచి ఆధార్ సర్వీస్ ఛార్జీలు పెరగనున్నాయి. తప్పుల సవరణకు లేదా వివరాల అప్డేట్‌కు ప్రస్తుతం రూ.50 ఉండగా రూ.75కు, బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ.100 ఉండగా రూ.125కు పెంచుతున్నట్లు UIDIA తెలిపింది. పోర్టల్ ద్వారా నేరుగా పొందే సేవలకు ఛార్జీలను రూ.50 నుంచి రూ.75కు పెంచినట్లు పేర్కొంది. పోయిన ఆధార్ స్థానంలో కొత్తది కావాలంటే రూ.40 అప్లికేషన్ ఫీజు చెల్లించాలని వెల్లడించింది.

News September 24, 2025

రాష్ట్రంలో 2 సెకన్లు కంపించిన భూమి

image

AP: ఒంగోలులో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటలకు 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో కంపనాలు నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. 10kmల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.