News August 7, 2025

ఈ నెలాఖరున ఇండియాకు పుతిన్?

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఆయన ఇండియాకు వస్తారని సమాచారం. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అక్కడి పత్రికలకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News August 10, 2025

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుందని అంచనా వేశారు. మరోవైపు హైదరాబాద్‌లో మధ్యాహ్నం తేలికపాటి, రాత్రి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News August 10, 2025

ఇవాళ్టి నుంచి తిరంగా యాత్రలు: మాధవ్

image

AP: ఇవాళ్టి నుంచి 14 వరకు తిరంగా యాత్రలు నిర్వహించాలని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపటాలకు నివాళులు అర్పించాలని సూచించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు బీజేపీ శ్రేణులు తమ ఇళ్లపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయాలని, 15న బహిరంగ ప్రదేశాల్లో జెండా ఆవిష్కరణల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.

News August 10, 2025

కేటీఆర్ Vs కవిత.. రాఖీపే చర్చ!

image

TG: రాఖీ వేళ KTR, కవిత మధ్య దూరం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘అన్నా.. రాఖీ కట్టడానికి రానా?’ అని ఆమె మెసేజ్ చేయగా, ఆయన చాలా ఆలస్యంగా ‘నేను ఔట్ ఆఫ్ స్టేషన్’ అని రిప్లై ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ వైరం వల్ల కొంతకాలంగా అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్ధలొచ్చిన సంగతి బహిరంగ రహస్యమే. కానీ KTR కావాలనే అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ చర్చపై మీ COMMENT?