News October 16, 2024
కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు: సజ్జల

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘వైసీపీ నేతలను కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి? నటి జెత్వానీ కేసులోనూ ఇలాగే నన్ను ఇరికించారు. స్కిల్ కేసులో CBNకు ఈడీ క్లీన్ చిట్ ఎలా ఇస్తుంది? ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా?’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News January 3, 2026
కొడుకు, కోడలు క్యూట్ ఫొటో షేర్ చేసిన ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ కొడుకు రైహాన్ త్వరలో <<18710916>>పెళ్లి<<>> చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడుకు, కాబోయే కోడలు క్యూట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. వారిద్దరూ మూడేళ్ల వయసు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘మీ ఇద్దరినీ ఎంతో ప్రేమిస్తున్నా. ఎల్లప్పుడూ ఒకరినొకరూ ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండండి. మూడేళ్ల వయసు నుంచీ ఉన్నట్లే ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగండి ’ అని రాసుకొచ్చారు.
News January 3, 2026
గ్రూపులు బువ్వ పెట్టవు.. కొత్త నేతలను గద్దల్లా పొడవొద్దు: ఈటల

TG: పార్టీలో చేరిన నేతలను గౌరవించి అక్కున చేర్చుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అంతేతప్ప కాకులు, గద్దల్లా పొడవొద్దని అన్నారు. ‘గ్రూపులు మంచివి కావు. అవి బువ్వ పెట్టవు. మనకు ఉన్న శక్తే తక్కువ. మళ్లీ ఇందులో గ్రూపులు అవసరమా? రాజకీయాల్లో విశాల హృదయంతో ఆలోచించాలి. శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు’ అని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
News January 3, 2026
జనవరి 3: చరిత్రలో ఈరోజు

1831: సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జననం
1925: నటుడు రాజనాల కాళేశ్వరరావు జననం
1934: రచయిత వీటూరి సత్య సూర్యనారాయణ మూర్తి జననం
1940: తెలుగు సినీ దర్శకుడు కట్టా సుబ్బారావు జననం
2002: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ మరణం
*జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం


