News July 8, 2024
ఒలింపిక్స్లో భారత పతాకధారిగా పీవీ సింధు

పారిస్ ఒలింపిక్స్కు వెళ్తున్న భారత బృందానికి చెఫ్ దే మిషన్(మొత్తం టీమ్కు ఇన్ఛార్జ్)గా షూటర్ గగన్ నారంగ్ను IOA నియమించింది. ఈయన దేశానికి నాలుగు ఒలింపిక్స్ పతకాలు తీసుకొచ్చారు. చెఫ్ దే మిషన్ బాధ్యతల నుంచి బాక్సర్ మేరీ కోమ్ తప్పుకోవడంతో నారంగ్కు అవకాశం వచ్చింది. అలాగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ తరఫున పతాకధారులుగా షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ వ్యవహరించనున్నారు.
Similar News
News November 17, 2025
వేరుశనగ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేరుశనగ పంట కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. పంటలో 70 నుంచి 80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి, కాయడొల్ల లోపల భాగం నలుపు రంగులోకి మారినప్పుడే పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క నుంచి కాయలను వేరుచేశాక కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగులు రాకుండా స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.
News November 17, 2025
VIRAL: ప్రభాస్ లేటెస్ట్ లుక్

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఫొటోలు వైరలవుతున్నాయి. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR, నటుడు సుబ్బరాజుతో కలిసి ఫొటోలు దిగారు. ఎప్పుడూ తలకు క్లాత్ ధరించి కనిపించే ఆయన చాలారోజుల తర్వాత ఇలా దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
News November 17, 2025
16 పోస్టులకు ఐఐసీటీ నోటిఫికేషన్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(<


