News February 15, 2025
భారత్లో పర్యటించనున్న ఖతర్ దేశాధినేత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీ ఈ నెల 17-18 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నట్లు తెలిపింది.
Similar News
News October 14, 2025
వాస్తుతో సంతోషకర జీవితం

ఇంటి వాస్తు బాగుంటేనే ఇంట్లో ఉండేవారందరూ సంతోషంగా ఉంటారని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘వాస్తు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తద్వారా మంచి నిద్ర, విశ్రాంతి లభిస్తాయి. సామాజిక బంధాలను మెరుగుపరిచే ఆలోచనలు తెస్తాయి. అవి అవకాశాలను మోసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాయి. దీంతో ఆనందం కలుగుతుంది. సంతోషకరమైన జీవితానికి వాస్తు మూల కారణం’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News October 14, 2025
ఉత్కంఠ పోరు.. భారత్, పాక్ మ్యాచ్ డ్రా

మలేషియాలో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్-2025 U21 హాకీ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఇరు జట్లు 3-3 గోల్స్ చేశాయి. ఒక దశలో 0-2తో వెనుకబడిన IND చివర్లో అద్భుతంగా పోరాడి 3-2తో లీడ్లోకి వెళ్లింది. విజయం ఖాయమనుకున్న సమయంలో పాక్ గోల్ కొట్టి లెవెల్ చేసింది. ఇప్పటికే బ్రిటన్, న్యూజిలాండ్పై గెలిచిన IND పాయింట్స్ టేబుల్లో టాప్లో కొనసాగుతోంది.
News October 14, 2025
గ్రౌండ్లోకి గులాబీ బాస్!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కార్యకర్తల్లో మరింత ఊపు తీసుకొచ్చి, ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. నవంబర్ మొదటి వారంలో ప్రచారానికి రానున్నారు. ఎర్రవల్లిలో పార్టీ అభ్యర్థి సునీతకు Bఫారమ్ ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభలోనా? లేక రోడ్ షోలో పాల్గొంటారనేది తెలియాల్సి ఉంది.