News September 21, 2024
ఇంటెల్ కంపెనీని కొంటున్న క్వాల్కామ్!

ఇంటెల్ను టేకోవర్ చేయాలని క్వాల్కామ్ భావిస్తోందని తెలిసింది. ఇప్పటికే దాన్ని సంప్రదించినట్టు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. నియంత్రణ సంస్థల ఆమోదం లభించి ఈ డీల్ పూర్తవ్వడానికి చాలా కాలమే పట్టొచ్చని అంచనా. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లను ఉత్పత్తి చేసే క్వాల్కామ్ ఈ మధ్యే పీసీ ప్రాసెసర్ల రంగంలోకి ఎంటరైంది. ఇక $1.6 బిలియన్ల లాస్లో ఉన్న ఇంటెల్ షేర్లు 2024లో 60% క్రాష్ అయ్యాయి.
Similar News
News November 17, 2025
తెనాలి: విషాద ఘటనలు.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెనాలి నాజరుపేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పవన్ తేజ (24) ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి మందలించగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో కొల్లిపర మండలం జముడుబాడుపాలెంకి చెందిన విద్యార్థిని లావణ్య (20) అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉరి వేసుకొని చనిపోయింది. ఈ రెండు ఘటనలపై వన్టౌన్, కొల్లిపర పోలీసులు కేసులు నమోదు చేశారు.
News November 17, 2025
సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.
News November 17, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.


