News December 16, 2024
తెలంగాణ గ్రూప్-2లో చంద్రబాబుపై ప్రశ్నలు

తెలంగాణ గ్రూప్-2 పరీక్షల్లో టీడీపీ, చంద్రబాబుపై కొన్ని ప్రశ్నలు అడిగారు.
*నిజాం సాగర్, కడెం ప్రాజెక్టులు ఎవరి పాలనలో నిర్మించారు.
1.కాంగ్రెస్ 2.నిజాం 3.టీడీపీ 4.TRS
*చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ తయారుచేసిన అంతర్జాతీయ సంస్థ ఏది?
1.మెక్కార్ట్నీ 2.మెక్ఆర్థర్ 3.మెక్కిన్సే 4.మెక్గ్రీన్
Similar News
News December 22, 2025
PCOSని ఎలా కంట్రోల్ చెయ్యాలంటే?

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇటీవల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వయసు, బరువుతో సంబంధం లేకుండా ఎవరైనా దీని బారిన పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే సరైన బరువును మెయింటైన్ చేయడం, మైండ్ ఫుల్ ఈటింగ్, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన మందులు వాడటం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
News December 22, 2025
శబరిమల భక్తులకు ‘కేరళ సద్య’

శబరిమలలో అయ్యప్ప భక్తులకు సంప్రదాయ కేరళ సద్య(విశేష విందు) పంపిణీ ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపప్రజ్వలన చేసి స్వామికి నివేదించారు. అనంతరం భక్తులకు వడ్డించారు. ఇందులో రైస్, పప్పు, సాంబార్, రసం, రెండు రకాలు కేరళ స్టైల్ కర్రీస్, పచ్చడి, అప్పడం, పాయసం వంటి వంటకాలు ఉంటాయి. రోజుకు 5,000 మందికిపైగా భక్తులకు రోజు విడిచి రోజు సద్య, మధ్యలో పులావ్ను భక్తులకు వడ్డించనున్నారు.
News December 22, 2025
తప్పు చేసినవారి తోలు తీసే బాధ్యత ప్రజలదే: పొన్నం

TG: ఉనికిని కాపాడుకునేందుకే <<18633627>>KCR<<>> నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏమీ లేకుండా చేశారు. తప్పుచేసినవారి తోలు తీసే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. గత పాలకుల నిర్వాకంతో కలిగిన ఇబ్బందులను మేము సరిచేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలని కోరుతున్నాం’ అని గాంధీభవన్లో చెప్పారు.


