News October 21, 2024

రబీసాగు లక్ష్యం 57.65లక్షల ఎకరాలు

image

AP: 2024-25 రబీ సాగుకు సంబంధించిన ప్రణాళికలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 56.58లక్షల ఎకరాలు కాగా ఈసారి 57.65లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించింది. ప్రధానంగా 19.87లక్షల ఎకరాల్లో వరి, 11.17లక్షల ఎకరాల్లో శనగ, 8.44లక్షల ఎకరాల్లో మినుము, 5.23లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేయనున్నారు. రబీకి సబ్సిడీతో 3.85లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం ఇవ్వనుంది.

Similar News

News October 21, 2024

దివ్వెల మాధురికి పోలీసుల నోటీసులు

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల తిరుమల వెళ్లిన మాధురి అక్కడ ఫొటోషూట్స్, రీల్స్ చేశారంటూ టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు<<14326522>> కేసు నమోదైంది<<>>. దీంతో తిరుమల వన్ టౌన్ పోలీసులు టెక్కలిలోని అక్కవరం సమీపంలో శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెకు నోటీసులిచ్చారు.

News October 21, 2024

సేవింగ్స్ ఖాతాలపై బ్యాంకుల వడ్డీ రేట్లు ఇలా..

image

IDFC బ్యాంక్: రూ.5లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3% వడ్డీ, రూ.5 లక్షల- రూ.100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే అత్యధికంగా 7.25% వడ్డీ అందిస్తోంది.
HDFC, ICICI: రూ.50 లక్షల లోపు 3% వడ్డీ, ఆపై బ్యాలెన్స్ ఉంటే 3.5% వడ్డీ అందిస్తున్నాయి.
SBI: రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్‌పై 2.70 %, ఆపై ఉంటే 3% వడ్డీ అందిస్తోంది
PNB: రూ.10 లక్షల లోపు బ్యాలెన్స్‌కు 2.70%, రూ.10 లక్షల- రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75% చెల్లిస్తుంది.

News October 21, 2024

జియోకు కోటి మంది యూజర్లు గుడ్ బై!

image

రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన తర్వాత రిలయన్స్ జియోకు యూజర్లు షాక్ ఇచ్చారు. రెండవ త్రైమాసికంలో 1.07కోట్ల మంది జియోకు గుడ్ బై చెప్పినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే 5G సబ్ స్క్రైబర్స్ బేస్ మాత్రం 17మిలియన్లు పెరిగి 147 మిలియన్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. వినియోగదారుల్ని కోల్పోవడం తమ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.