News June 27, 2024

తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్‌గా రాధాకృష్ణన్?

image

TG: రాష్ట్ర పూర్తి స్థాయి గవర్నర్‌గా ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ఝార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. పుదుచ్చేరికి కూడా ఆయన ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా ఉన్నారు. తనను తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్‌గా కొనసాగించాలని ఇటీవలే హోంమంత్రి అమిత్ షాను రాధాకృష్ణన్ కోరినట్లు సమాచారం. ఇందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News December 4, 2025

భారత్ ఓటమికి కారణమిదే..

image

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ <<18462441>>ఓటమికి<<>> చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగే కారణం. మార్క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడు సెంచరీతో చెలరేగాడు. ప్రసిద్ధ్ 8.2 ఓవర్లకు 82, కుల్దీప్ 10 ఓవర్లకు 78, హర్షిత్ 10 ఓవర్లకు 70 రన్స్ సమర్పించుకోవడం భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. ఇక ఇలాంటి ఫీల్డింగ్‌తో 400 కొట్టినా కాపాడుకోలేమని క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

News December 4, 2025

సీఎం చంద్రబాబుతో అదానీ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ పోర్ట్స్&SEZ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అదానీ గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు. ఈ మీటింగ్‌లో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.

News December 3, 2025

IND vs SA.. రెండో వన్డేలో నమోదైన రికార్డులు

image

☛ వన్డేల్లో ఇది మూడో అత్యధిక ఛేజింగ్ స్కోర్ (359)
☛ వన్డేల్లో కోహ్లీ వరుసగా 2 మ్యాచుల్లో సెంచరీ చేయడం ఇది 11వ సారి
☛ SAపై అత్యధిక సెంచరీలు (7) చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
☛ 77 బంతుల్లో రుతురాజ్ సెంచరీ.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఇండియా బ్యాటర్‌కు ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. Y పఠాన్ (68బాల్స్) తొలి స్థానంలో ఉన్నారు.
☛ సచిన్ 34 వేర్వేరు వేదికల్లో ODI సెంచరీలు చేశారు. దానిని కోహ్లీ సమం చేశారు.