News June 27, 2024
తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్గా రాధాకృష్ణన్?

TG: రాష్ట్ర పూర్తి స్థాయి గవర్నర్గా ఇన్ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ఝార్ఖండ్ గవర్నర్గా కొనసాగుతున్నారు. పుదుచ్చేరికి కూడా ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు. తనను తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్గా కొనసాగించాలని ఇటీవలే హోంమంత్రి అమిత్ షాను రాధాకృష్ణన్ కోరినట్లు సమాచారం. ఇందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News April 7, 2026
MBNR: ఆ పదవికి ఫుల్ డిమాండ్.!

MBNR జిల్లాలోని 16 మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడంతో, తమ జిల్లా తుది జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ పదవులకు భారీగా పోటీ ఏర్పడింది. మండల స్థాయిలో పట్టు సాధించేందుకు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
News April 7, 2026
వాట్సాప్లో మీకు ఈ మెసేజ్ వచ్చిందా?

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు <<19512470>>‘సిమ్ బైండింగ్’<<>> అమలుకు వాట్సాప్ టెస్టింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘మీ ఫోన్లోని సిమ్ నంబర్ను తనిఖీ చేయడానికి అనుమతించండి’ అనే సందేశాలను యూజర్లకు పంపుతోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరలవుతోంది. డిసెంబర్ 31 తర్వాత రిజిస్టర్డ్ సిమ్ కార్డు ఫోన్లో లేకపోతే మెసేజింగ్ యాప్లు పనిచేయవు.
* మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
News April 7, 2026
ఇంటర్.. ప్రత్యేకంగా అదనపు సబ్జెక్ట్ ఫలితాలు?

AP: ఇంటర్ విద్యలో సంస్కరణల్లో భాగంగా విద్యార్థులు 5 గ్రూప్ సబ్జెక్టులతోపాటు అదనంగా ఆరో సబ్జెక్టును ఎంపిక చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సబ్జెక్టు ఫలితాలను ప్రత్యేకంగా వెబ్సైట్లో పెట్టడం లేదా కాలేజీలకు పంపాలని అధికారులు యోచిస్తున్నారు. రెగ్యులర్ సబ్జెక్టుల రిజల్ట్స్ ఈ నెల 15-20 మధ్య రిలీజ్ చేసే <<19571013>>అవకాశం ఉంది<<>>.


