News November 14, 2024
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కనుమూరు రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు. కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి RRR తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Similar News
News December 12, 2025
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!

అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం కేంద్ర క్యాబినెట్లో చర్చకు రాలేదు. AP నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్లో ఆమోదించి అనంతరం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాగా సాంకేతిక సమస్యల పరిష్కారంపై AP కసరత్తు చేపట్టింది. 2014-2024 వరకు అమరావతినే రాజధానిగా గుర్తించేలా అది అధ్యయనం చేస్తోంది. ఫ్యూచర్లో రాజధానిని మార్చకుండా ఒకే క్యాపిటల్ ఉండేలా చర్య తీసుకుంటోంది.
News December 12, 2025
మరోసారి అన్నా హజారే నిరాహార దీక్ష

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు. జనవరి 30నుంచి ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. 2022లో దీక్ష చేసినప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు.
News December 12, 2025
అన్ని మతాలకు వాస్తు వర్తిస్తుందా?

వాస్తు ఓ మతానికే పరిమితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘వాస్తు పంచభూతాల కలయికపై ఆధారపడిన శాస్త్రం. మతాలు, కులాలు మనుషులు ఏర్పరచుకున్నవే. పంచభూతాలు మతాలకు అతీతమైనవి కాబట్టి వాస్తు కూడా అతీతమే అవుతుంది. మనం నివసించే ఇంట్లో ఇవి సక్రమంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే జీవితం సవ్యంగా, ఆరోగ్యంగా సాగుతుంది. లేకపోతే ఆ దుష్ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయి. వాస్తు అందరికీ అవసరం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


