News November 26, 2024

రఘురామకృష్ణరాజు కేసు.. విజయ్‌పాల్ అరెస్ట్

image

AP: మాజీ MP, ప్రస్తుత Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి పాల్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్ పాల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

Similar News

News December 13, 2025

గేదె ఇచ్చే పాలను ఒక్కపూటే చూసి మోసపోవద్దు

image

☛ గేదెను కొనేటప్పుడు అది ఇచ్చే పాలను కేవలం ఒకపూట మాత్రమే చూసి మోసపోవద్దు. కొనే రోజు సాయంత్రం, తర్వాతి రోజు ఉదయం, సాయంత్రం దగ్గరుండి పాలు పితికించి తీసుకోవాలి. అప్పుడే ఆ గేదె పాల సామర్థ్యం తెలుస్తుంది.
☛ గేదెను కొనేముందు దాని ‘పాల నరం’ని చెక్ చేయాలి. ఇది పొట్ట కింద, పొదుగు వైపు వెళ్లే లావుపాటి నరం. ఇది స్పష్టంగా కనిపించాలి. ఇది ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ పాలు వస్తాయంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News December 13, 2025

హీరోయిన్ ఇలా మారిపోయారేంటి?

image

మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘కడలి’ మూవీ హీరోయిన్ తులసీ నాయర్ లుక్ షాక్‌కు గురి చేస్తోంది. ఎక్కువ లావు అవ్వడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఆమెకు ఏమయ్యిందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆరోగ్య సమస్యలతోనే ఇలా మారినట్లు తెలుస్తోంది. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ చిన్నకూతురే ఈ తులసి. కేవలం రెండు చిత్రాల్లోనే నటించి ఇండస్ట్రీకి దూరమయ్యారు. మరో కూతురు కార్తీక కూడా పలు చిత్రాల్లో నటించారు.

News December 13, 2025

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ఢిల్లీ సర్కార్ చట్టం

image

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. తాజాగా దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం అనుమతించిన ఫీజు ధరలనే స్కూల్స్‌ వసూలు చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25, అడ్మిషన్ ఛార్జీలు రూ.200గా నిర్ణయించారు. 3 ఏళ్లపాటు ఫీజులు స్థిరంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఇటువంటి చట్టం తెలుగు రాష్ట్రాల్లోనూ తీసుకొస్తే బాగుంటుంది కదా?