News November 26, 2024

రఘురామకృష్ణరాజు కేసు.. విజయ్‌పాల్ అరెస్ట్

image

AP: మాజీ MP, ప్రస్తుత Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి పాల్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్ పాల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

Similar News

News November 26, 2025

రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోకి ఒంటిమిట్ట, సిద్దవటం

image

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్‌లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

News November 26, 2025

రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోకి ఒంటిమిట్ట, సిద్దవటం

image

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్‌లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

News November 26, 2025

నేటి నుంచి మౌఢ్యమి.. శుభ కార్యాలు ఎందుకు చేయకూడదంటే?

image

ఈరోజు నుంచి మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఇది వచ్చే ఏడాది FEB 17 వరకు 83 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజుల్లో గురు, శుక్ర గ్రహాలు సూర్యుడి దగ్గరి వరకు వెళ్లడంతో వాటి శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుంది. అయితే శుభ కార్యాలకు ఈ గ్రహాల బలం అవసరం. ఆ బలం తగ్గినప్పుడు శుభ కార్యాలు చేస్తే ఫలితం ఉండదని నమ్ముతారు. ☞ మౌఢ్యమి రోజుల్లో ఏయే పనులు చేయవచ్చు, వేటిని చేయకూడదో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.