News August 31, 2025
విద్యార్థులకు రాగిజావ.. 40% ఖర్చు భరించనున్న ప్రభుత్వం!

TG: సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వారానికి 3 రోజులపాటు రాగిజావను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అయ్యే ఖర్చులో 40% భరించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. మిగతా ఖర్చును శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు భరిస్తుంది. ట్రస్టుతో కలిసి గత రెండేళ్లుగా ప్రభుత్వం రాగిజావను అందిస్తోండగా, ఈ ఏడాది ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులకు మళ్లీ రాగిజావ పంపిణీ ప్రారంభం కానుంది.
Similar News
News September 1, 2025
తాజా సినీ ముచ్చట్లు

★ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో హీరోయిన్గా రుక్మిణీ వసంత్.. ‘మదరాసి’ మూవీ ఈవెంట్లో వెల్లడి
★ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు స్పెషల్ అప్డేట్
★ విక్టరీ వెంకటేశ్, వీవీ వినాయక్ కాంబోలో త్వరలో సినిమా?
★ ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాల డైరెక్టర్ శివ నిర్వాణతో రవితేజ థ్రిల్లర్ మూవీ?
News September 1, 2025
దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ

AP: <<17398848>>నోటీసులతో<<>> సంబంధంలేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని CM ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులందుకున్న 1.35లక్షల మందిలో 95% మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హులపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా 7,872 మందికి రూ.4వేలు చొప్పున స్పౌజ్ పింఛన్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.3.15 కోట్లు రిలీజ్ చేశారు.
News September 1, 2025
తుమ్మిడిహట్టి, మేడిగడ్డపైనే ప్రధాన చర్చ

TG: కాళేశ్వరాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంపైనే అసెంబ్లీలో ప్రధాన చర్చ జరిగింది. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం చెప్పినా BRS ప్రభుత్వం దోపిడీ చేసేందుకే దాన్ని మార్చిందని సీఎం రేవంత్ ఆరోపించారు. MH అభ్యంతరం కేవలం ఎత్తుపైనే అని తెలిపారు. మేడిగడ్డ వద్ద అదనంగా 120 TMCల లభ్యత ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎక్స్పర్ట్స్ కమిటీ, CWC సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామన్నారు.