News December 31, 2024

రాహుల్ బౌన్స‌ర్‌లా ప్ర‌వ‌ర్తించారు: బీజేపీ ఎంపీ

image

పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఇటీవ‌ల అధికార‌, విప‌క్షాల మ‌ధ్య జ‌రిగిన తోపులాట‌లో గాయ‌ప‌డిన BJP MP ప్ర‌తాప్ చంద్ర ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు రాహుల్ విపక్ష నేత‌గా కాకుండా బౌన్స‌ర్‌గా ప్ర‌వ‌ర్తించార‌ని మండిప‌డ్డారు. BJP MPల‌ను రాహుల్ నెట్టుకుంటూ వ‌చ్చార‌ని, దీంతో ఎంపీ ముకేశ్ త‌న మీద ప‌డ‌డంతో గాయ‌ప‌డిన‌ట్టు తెలిపారు. జ‌గ‌న్నాథుడి ద‌య‌తోనే తాను కోలుకున్న‌ట్టు పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

T2OIWC-2026.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

image

భారత్, శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే మెన్స్ T2OIWCలో 20 జట్లు 4 గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. ఒక గ్రూపులో ఇండియా, పాక్, USA, నమీబియా, నెదర్లాండ్స్, రెండో గ్రూపులో ఆసీస్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ ఉంటాయని క్రిక్‌బజ్ వెల్లడించింది. మూడో గ్రూపులో ఇంగ్లండ్, విండీస్, ఇటలీ, బంగ్లాదేశ్, నేపాల్, నాలుగో గ్రూపులో సౌతాఫ్రికా, కివీస్, అఫ్గాన్, UAE, కెనడా ఉంటాయని తెలిపింది.

News November 22, 2025

బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్ష ప్రయాణమే సులువు: శుభాంశు

image

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు బెంగళూరు ట్రాఫిక్ చిరాకు తెప్పించింది. టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన అక్కడి ట్రాఫిక్ కష్టాలపై చమత్కరించారు. ‘బెంగళూరులోని ఈ ట్రాఫిక్‌ను దాటడం కంటే అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులువు’ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘మారతహళ్లి నుంచి ఈవెంట్‌కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ పట్టింది’ అని నవ్వుతూ నగర ప్రజల బాధను హైలైట్ చేశారు.

News November 22, 2025

‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

image

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్‌ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.