News December 31, 2024

రాహుల్ బౌన్స‌ర్‌లా ప్ర‌వ‌ర్తించారు: బీజేపీ ఎంపీ

image

పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఇటీవ‌ల అధికార‌, విప‌క్షాల మ‌ధ్య జ‌రిగిన తోపులాట‌లో గాయ‌ప‌డిన BJP MP ప్ర‌తాప్ చంద్ర ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు రాహుల్ విపక్ష నేత‌గా కాకుండా బౌన్స‌ర్‌గా ప్ర‌వ‌ర్తించార‌ని మండిప‌డ్డారు. BJP MPల‌ను రాహుల్ నెట్టుకుంటూ వ‌చ్చార‌ని, దీంతో ఎంపీ ముకేశ్ త‌న మీద ప‌డ‌డంతో గాయ‌ప‌డిన‌ట్టు తెలిపారు. జ‌గ‌న్నాథుడి ద‌య‌తోనే తాను కోలుకున్న‌ట్టు పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

image

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

News November 24, 2025

స్మృతి పెళ్లి వాయిదా.. మరో బిగ్ ట్విస్ట్!

image

స్మృతి మంధాన పెళ్లి వేళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు పెళ్లి వేడుకకు సంబంధించి SMలో పోస్ట్ చేసిన ఫొటోలను స్మృతి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇన్‌స్టాలో ఆ ఫొటోలు, వీడియోలేమీ కనిపించడంలేదు. దీంతో అసలేం జరుగుతుందో తెలియక ఆమె అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. నిన్న వివాహం జరగడానికి ముందు ఆమె తండ్రికి గుండెపోటు రాగా తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అనారోగ్యానికి గురయ్యారు.

News November 24, 2025

19ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర పెళ్లి

image

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 19ఏళ్ల వయసులోనే 1954లో ఆయన ప్రకాశ్‌ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ వంటి ప్రసిద్ధ నటులతో పాటు విజేత, అజీత అనే కూతుళ్లు ఉన్నారు. అనంతరం 1980లో సహనటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. హేమ-ధర్మేంద్ర దంపతులకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.