News September 11, 2024
రాహుల్.. బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లను రద్దు చేయలేరు: షా

రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని బయటపెట్టారని HM అమిత్ షా అన్నారు. BJP ఉన్నంత వరకు ఎవరూ వాటిని రద్దు చేయలేరని, జాతి భద్రతకు విఘాతం కలిగించలేరని తెలిపారు. ‘దేశ విభజనకు కుట్రలు చేసేవారికి (JKNC) మద్దతివ్వడం, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్కు అలవాటుగా మారాయి. భాష, మతం, ప్రాంతం పేరుతో ఆయన చిచ్చు పెడుతున్నారు’ అని విమర్శించారు.
Similar News
News November 27, 2025
నాయకుల ‘ఏకగ్రీవ’ ప్రకటనలు.. ఓటుకు విలువ లేదా?

TG: పంచాయతీ ఎన్నికల వేళ నాయకుల ఆఫర్లు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. తమ పార్టీ వ్యక్తి సర్పంచ్గా ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి ₹10L-30L ఇస్తామంటున్నారు. అయితే ప్రజల ఓట్లతో గెలిస్తే నిధులివ్వరా? ఏకగ్రీవ ప్రస్తావన చట్టాల్లో ఉన్నప్పటికీ ఓటుకు విలువ లేదా? ‘పెద్దలు’ ఏకమై ఏకగ్రీవాలు చేసుకుంటే.. తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే హక్కు ప్రజలు కోల్పోవడం సమంజసమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీరేమంటారు?
News November 27, 2025
వీళ్లు క్యారెట్ తినకూడదని తెలుసా?

మలబద్దకం, డయాబెటిస్, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్యారెట్లు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దురద, దద్దుర్లు, స్కిన్ ఇరిటేషన్ ఉన్నవాళ్లు తినకపోవడం మంచిది. పాలిచ్చే మహిళలు తింటే పాలు రుచి మారి శిశువులు తాగడానికి ఇబ్బంది పడతారు. ఒత్తిడి, ఆందోళన, పలు కారణాలతో నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తినకూడదు. అవి నిద్రకు మరింత అంతరాయం కలిగిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
News November 27, 2025
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

AP: రేషన్షాపులను విలేజ్ మాల్స్గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్తోపాటు పప్పులు, నూనెలు, గోధుమ పిండి, రవ్వ తదితర 15 రకాల వస్తువులను తక్కువ ధరకు ఇవ్వనుంది. దీనివల్ల రేషన్ డీలర్లకు అదనపు ఆదాయంతోపాటు పేదలకు లబ్ధిచేకూరుతుందని భావిస్తోంది. ఇప్పటికే రేషన్ డీలర్లతో చర్చించింది. మరోవైపు లబ్ధిదారులకు బియ్యం, షుగర్తోపాటు రాగులు, జొన్నలు, కొర్రలు నేటి నుంచి దశలవారీగా ప్రభుత్వం ఇవ్వనుంది.


