News July 5, 2024
రాజ్యాంగ స్ఫూర్తి రక్షణలో రాహుల్ ఫెయిల్: కేటీఆర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720137654200-normal-WIFI.webp)
TG: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విఫలమయ్యారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్కు కట్టుబడి ఉన్నామంటూనే ఇతర పార్టీల గుర్తులపై గెలిచినవారిని పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. రాజ్యసభ ఎంపీగా కేకే రాజీనామా చేయడాన్ని ఆయన స్వాగతించారు.
Similar News
News July 8, 2024
రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718977727932-normal-WIFI.webp)
తెలంగాణ సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. తొలుత తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట. రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
News July 8, 2024
హిండెన్బర్గ్ వివాదం.. దర్యాప్తు చేపట్టిన కోటక్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719899164556-normal-WIFI.webp)
కింగ్డన్ క్యాపిటల్ తమ సంస్థ వేదికగా అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్కు పాల్పడటంపై కోటక్ గ్రూప్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హిండెన్బర్గ్తో కింగ్డన్కు సంబంధాలు ఉన్నాయని ముందే తెలిస్తే అసలు FPI అకౌంట్నే ఓపెన్ చేసే వాళ్లము కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్డన్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం దాచిందని అనుమానిస్తున్నాయి. ఇందుకు ఆధారాలు లభిస్తే కోటక్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News July 8, 2024
ఉచిత ఇసుకపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720054576488-normal-WIFI.webp)
AP: ఉచిత ఇసుకపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్గా జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో SP, JC, వివిధ శాఖల అధికారులు ఉంటారు. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీల బాధ్యతను జిల్లా కమిటీలే పర్యవేక్షిస్తాయి. ఇసుకను తిరిగి అమ్మినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.