News May 4, 2024
దళితులకు రాహుల్ గాంధీ సారీ చెప్పాలి: బీజేపీ

రోహిత్ వేముల మృతిని రాహుల్ గాంధీ రాజకీయం చేశారని, దళితులకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రోహిత్ దళితుడు కాదని, అతడి మృతి ఆత్మహత్యేనని అక్కడి పోలీసులు కోర్టుకిచ్చిన క్లోజర్ రిపోర్టులో పేర్కొన్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దళితుల్ని రాజకీయం కోసమే వాడుకున్నాయి. వారికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి’ అని మండిపడ్డారు.
Similar News
News November 27, 2025
‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్పై కామెంట్స్.. SRనగర్లో ఫిర్యాదు

సింగర్ మంగ్లీ తన తాజా పాట ‘బాయిలోనే బల్లి పలికే’పై జనాదరణ పొందింది. అటువంటి పాట మీద ఓ వ్యక్తి అసభ్యకరంగా, కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడంటూ SRనగర్ PSలో ఆమె ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తన పాటనే కాకుండా, జాతిని ఉద్దేశిస్తూ నీచంగా మాట్లాడారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఓ వర్గాన్ని కించపరిచిన ఆ వ్యక్తిని శిక్షించాలని పోలీసులను మరోవైపు కొందరు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
News November 27, 2025
NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. జీవో నం.46 అంటే ఏంటి?

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నం.46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను <<18402975>>సవాల్ చేస్తూ హైకోర్టులో<<>> పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.


