News January 27, 2025
రంజీలకు సిద్ధమైన రాహుల్, సిరాజ్, పరాగ్

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న హరియాణా మ్యాచ్కు అందుబాటులో ఉంటానని రాహుల్ కర్ణాటక జట్టుకు సమాచారమిచ్చారు. అటు హైదరాబాద్ తరఫున సిరాజ్, అస్సాం తరఫున రియాన్ పరాగ్ ఆడనున్నారు. మరోవైపు రైల్వేస్తో ఆడేందుకు ఢిల్లీ జట్టును ఇవాళ సెలక్టర్లు ప్రకటించనున్నారు. ఇప్పటికే రోహిత్, పంత్ తదితరులు రంజీ మ్యాచులు ఆడుతున్న విషయం తెలిసిందే.
Similar News
News November 22, 2025
దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం ఆత్మహత్య

HYD అంబర్పేట్కు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు వారి కూతురు శ్రావ్యతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిరోజుల కిందట వారి పెద్ద కూతురు కూడా సూసైడ్ చేసుకుంది. తర్వాత ఈ ఫ్యామిలీ రాంనగర్ నుంచి అంబర్పేట్కు మారింది. తమనీ దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురి దగ్గరికే వెళ్తామని చుట్టుపక్కల వాళ్లతో చెప్పినట్లు సమాచారం. దీంతో మూఢనమ్మకాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
News November 22, 2025
పరకామణి కేసు.. శ్రీనివాసులుకు భద్రత కల్పించండి: హైకోర్టు

AP: పరకామణి <<18290953>>కేసులో<<>> పిటిషనర్ శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ దర్యాప్తు కోరుతూ శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఫిర్యాదుదారు సతీశ్ అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే.
News November 22, 2025
తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో ఉండకూడదు: HC

తండ్రి పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లో కొడుకు ఉండటానికి వీల్లేదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. సవాయ్ మాధోపూర్కు చెందిన ఖత్రీ, ఆయన కుమారుడికి మధ్య ఆస్తి వివాదంలో ఈ తీర్పిచ్చింది. తన బాగోగులు చూసుకోవడం లేదంటూ కొడుకు, కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఖత్రీ కోరారు. వివాదం పెద్దదై HCకి చేరింది. తానూ ఇంటి యజమానినేనంటూ కొడుకు వాదించాడు. తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఉండటానికి వీల్లేదని HC చెప్పింది.


