News August 6, 2024
పార్లమెంటు ఛాంబర్లో రైతు నేతలతో రాహుల్ చర్చలు

పార్లమెంటు భవనంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం బిజీగా గడిపారు. సాయంత్రం ఆయన రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. 11 మంది సంయుక్త కిసాన్ మోర్చా నాయకులను తన ఛాంబర్లో కలిశారు. అయితే వారు ఏయే అంశాలపై చర్చించారో తెలియాల్సి ఉంది. కొన్నిరోజుల క్రితం రైతు నేతలను పార్లమెంటులోకి రానివ్వడం లేదని రాహుల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లో ఆయన రైతుల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది.
Similar News
News March 4, 2026
యూరియా ఉత్పత్తి తగ్గుదల.. పెరగనున్న రేట్లు?

మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఖతర్లో LNG <<19281702>>ఉత్పత్తి<<>> నిలిచిపోవడంతో ఇండియాలో యూరియా ప్రొడక్షన్ను కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలోనూ కీలకమైన ఇన్పుట్. యూరియా కొరత ఏర్పడితే రేట్లు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
News March 4, 2026
ఫిన్+టిమ్= అదిరెన్.. T20WCలో సరికొత్త చరిత్ర

T20WC-2026లో కివీస్ ఓపెనర్లు <<19299520>>ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్<<>> రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఈ ఎడిషన్లో 10.93 రన్ రేట్తో 463 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. T20WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా ఇవే అత్యధికం. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.
News March 4, 2026
మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్ షాకు సీఎం రిపోర్ట్

ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం నివేదిక ఇచ్చారు. ఆపరేషన్ కగార్కు తెలంగాణ పోలీసులు సహకరించారని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని షా కోరారు. తెలంగాణలో ఈగల్ టీమ్ను బలోపేతం చేయాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు గురించి రేవంత్ వివరించారు. రాష్ట్రానికి IPS క్యాడర్ను పెంచాలని కోరారు.


