News September 5, 2024

ఈ నెల 8న అమెరికాకు రాహుల్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 8-10 తేదీల మధ్యలో USలో పర్యటించనున్నారు. ప్రవాసులతో భేటీ అవడంతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతోనూ భేటీ కావొచ్చని తెలుస్తోంది. చివరిగా గత ఏడాది మేలో రాహుల్ అమెరికాలో పర్యటించారు. ప్రభుత్వ వ్యవస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Similar News

News November 7, 2025

పెరిగిన ఓటింగ్.. మార్పుకు సంకేతమా..?

image

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారీ ఓటింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. అధికారపక్షంపై అసహనం, ఆగ్రహం అధికంగా ఉంటే ఓటర్లూ అదేస్థాయిలో పోలింగ్ స్టేషన్లకు వస్తారన్నారు. 1998సం.లో (MP ఎన్నికలు) తొలిసారి 64%, 2000లో 62% ఓటింగ్ నమోదవగా అప్పుడు అధికార బదిలీ జరిగింది. ఈసారి ఇది రిపీటవుతుందా?

News November 7, 2025

బాలీవుడ్ నటి సులక్షణ కన్నుమూత

image

ప్రముఖ బాలీవుడ్ నటి, సింగర్ సులక్షణా పండిట్(71) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు లలిత్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో సంగీత విద్వాంసుల కుటుంబంలో ఈమె జన్మించారు. తొలుత సింగర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ‘సంకల్ప్’ మూవీలో పాటకు ఫిలింఫేర్ అందుకున్నారు. ఆ తర్వాత సంజీవ్ కుమార్, రాజేశ్ ఖన్నా, జితేంద్ర, శత్రుఘ్నసిన్హా వంటి ప్రముఖుల సరసన నటించారు.

News November 7, 2025

దాతృత్వంలో శివ్ నాడార్ అగ్రస్థానం

image

ఈ ఏడాది అత్యధిక విరాళాలు అందించిన వారి జాబితాలో శివ్ నాడార్(HCL టెక్నాలజీస్) ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. వారు ₹2,708Cr విరాళం ఇచ్చినట్లు ఎడెల్‌గివ్ హురున్ వెల్లడించింది. గత ఐదేళ్లలో 4సార్లు ఆయన టాప్‌లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ముకేశ్(₹626Cr), బజాజ్(₹446Cr), బిర్లా(₹440Cr), అదానీ(₹386Cr), నందన్(₹365Cr), హిందూజ(₹298Cr), రోహిణి(₹204Cr) ఉన్నారు. మొత్తంగా 191 మంది కుబేరులు ₹10,380Cr ఇచ్చారు.