News August 1, 2024

రాహుల్ vs పంత్.. రోహిత్ శర్మ ఏమన్నారంటే?

image

శ్రీలంకతో రేపటి నుంచి జరిగే ODI సిరీస్‌లో WKగా ఎవరిని ఆడించాలనేది ఇంకా నిర్ణయించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘కేఎల్ రాహుల్, పంత్ ఇద్దరూ క్వాలిటీ ప్లేయర్స్, మ్యాచ్ విన్నర్స్. టీమ్‌లో క్వాలిటీ ఉంది కాబట్టే సెలక్షన్ గురించి బయట చర్చ జరుగుతోంది. జట్టులో ఇలాంటి మంచి ప్లేయర్లు ఉన్నప్పుడు తుది జట్టు ఎంపిక కష్టంగా మారుతుంది. కానీ ఇలాంటి సమస్యలు ఉండటం మంచిదే’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నారు.

Similar News

News December 3, 2025

గద్వాల: ఎన్నికల సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్

image

గద్వాల కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్‌తో కలిసి కలెక్టర్ సంతోష్ సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు 974 పీఓలు, 1,236 ఓపీఓలు సహా మొత్తం 2,210 మంది సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా ఈ సిబ్బందిని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

News December 3, 2025

124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<>BSE<<>>) 124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ/ఎంఈడీ, నెట్/SLAT, పీహెచ్‌డీ, ఎంబీఏ, సీఏ, ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష(టైర్1, టైర్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cbse.gov.in

News December 3, 2025

‘సంచార్ సాథీ’తో 7 లక్షల ఫోన్లు రికవరీ: PIB

image

<<18445876>>సంచార్ సాథీ<<>> గురించి వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ యాప్‌ గురించి PIB వివరించింది. ఈ ఏడాది జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్‌నకు 1.4 కోట్లకుపైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించిన ఫోన్‌లను బ్లాక్ చేసి, 26 లక్షలకు పైగా మొబైల్‌లను ట్రేస్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 7.23 లక్షల ఫోన్లు తిరిగి ఓనర్ల వద్దకు చేరాయని, యూజర్ల ప్రైవసీకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.