News August 1, 2024
రాహుల్ vs పంత్.. రోహిత్ శర్మ ఏమన్నారంటే?
శ్రీలంకతో రేపటి నుంచి జరిగే ODI సిరీస్లో WKగా ఎవరిని ఆడించాలనేది ఇంకా నిర్ణయించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘కేఎల్ రాహుల్, పంత్ ఇద్దరూ క్వాలిటీ ప్లేయర్స్, మ్యాచ్ విన్నర్స్. టీమ్లో క్వాలిటీ ఉంది కాబట్టే సెలక్షన్ గురించి బయట చర్చ జరుగుతోంది. జట్టులో ఇలాంటి మంచి ప్లేయర్లు ఉన్నప్పుడు తుది జట్టు ఎంపిక కష్టంగా మారుతుంది. కానీ ఇలాంటి సమస్యలు ఉండటం మంచిదే’ అని ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు.
Similar News
News February 2, 2025
తెలుగోళ్లు.. టాలెంట్ చూపిస్తున్నారు
భారత జట్టు అనగానే అప్పట్లో ఒకరిద్దరి తెలుగు ప్లేయర్ల పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సిరాజ్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, గొంగడి త్రిష సత్తా చాటుతున్నారు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ మరింత మంది ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
News February 2, 2025
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. విదేశాలకు శ్రీతేజ్?
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్లాల్సి వస్తే ఖర్చు తానే భరిస్తానని వైద్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న గాయపడ్డ శ్రీతేజ్ రెండు నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ట్యూబ్ ద్వారానే లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నారు.
News February 2, 2025
కులగణన సర్వే వివరాలు
TG: * సర్వేలో పాల్గొన్న జనాభా: 3.54 కోట్లు(96.9 శాతం)
* ఎస్సీల జనాభా: 17.43 శాతం
* ఎస్టీల జనాభా: 10.45 శాతం
* బీసీల జనాభా: 46.25 శాతం
* ముస్లిం మైనారిటీ బీసీలు: 10.08 శాతం
* ముస్లింల మైనారిటీ బీసీలతో కలిపి మొత్తం బీసీలు: 56.33 శాతం
* ముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతం
* ముస్లిం మైనారిటీలు: 12.56 శాతం
* ఓసీల జనాభా: 15.79 శాతం
* సర్వేలో పాల్గొనని జనాభా- 3.1 శాతం