News July 3, 2024
రాహుల్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలి: మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719920660062-normal-WIFI.webp)
అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలను రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చి లోక్సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలను పిల్లల ప్రవర్తన అని చెప్పి తేలికగా తీసుకోవద్దని స్పీకర్ ఓం బిర్లాను కోరాను. హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్గా మారిపోయిందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి సీనియర్ నేతలున్నా అరాచక, అబద్ధాల మార్గంలో వెళ్లాలనుకోవడం ఆందోళనకరమన్నారు.
Similar News
News July 5, 2024
ఎంట్రీ ఇస్తే మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్దది!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164733135-normal-WIFI.webp)
జియో IPO వస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ప్రస్తుతం LIC ఐపీఓ (₹21వేల కోట్లు) టాప్లో ఉంది. మరోవైపు ₹25వేల కోట్లతో హ్యుందాయ్ ఐపీఓ లాంచ్కు సిద్ధంగా ఉంది. కానీ జియో ఐపీఓ ఇందుకు రెండింతలు (₹55,500కోట్లు) ఉంటుందని జెఫరీస్ సంస్థ చెబుతోంది. ₹లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉండే సంస్థలు కనిష్ఠంగా 5% షేర్లు ఐపీఓలో పెట్టొచ్చు. కాగా జియో Mcap ₹11.11లక్షల కోట్లుగా ఉంది.
News July 5, 2024
అనంత్ అంబానీ సంగీత్లో సల్మాన్, రణ్వీర్ డాన్సులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164491054-normal-WIFI.webp)
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల సంగీత్ కార్యక్రమం ఈరోజు రాత్రి ముంబైలో జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, జాన్వీ కపూర్ ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం గడచిన వారం రోజులుగా వారు రిహార్సల్స్ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ సైతం ఈ కార్యక్రమంలో పాడేందుకు భారత్కు చేరుకున్నారు.
News July 5, 2024
రేపు పులివెందులకు వైఎస్ జగన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720166052872-normal-WIFI.webp)
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం నియోజకవర్గానికి వెళ్లనున్న ఆయన.. 2 రోజులు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.