News April 21, 2025

రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కేసు.. కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కేసులో కేంద్ర హోంశాఖకు అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల్లో ఆయన పౌరసత్వంపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందని, దీంతో భారత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.

Similar News

News August 9, 2025

మీ నిద్రని ట్రాక్ చేస్తున్నారా?

image

స్లీప్ ట్రాకింగ్‌తో ఎన్నో ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘స్లీప్ ట్రాకింగ్‌తో మీ నిద్ర, శరీరం స్పందిస్తున్న తీరు తెలుస్తుంది. ఎంతసేపు నిద్రపోయారు, ఎంత క్వాలిటీ నిద్ర పోయారో తెలుసుకోవచ్చు. ఈ రికార్డ్స్‌‌తో చికిత్సలేని కొన్ని నిద్ర సమస్యలను ముందే గుర్తించవచ్చు. దాంతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అని సూచిస్తున్నారు. స్మార్ట్ వాచ్, హెల్త్ రింగ్, AI పరికరాలతో మీ నిద్రని ట్రాక్ చేసుకోవచ్చు.

News August 9, 2025

SSC CGL పరీక్షలు వాయిదా

image

ఆగస్టు 13-30 వరకు జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL) పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఫేజ్-13లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు SSC ప్రకటించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఆ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. 14,582 గ్రూప్ B, C పోస్టులకు గతంలో SSC నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News August 8, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* అల్లూరి జిల్లాలో స్కూళ్ల అభివృద్ధికి రూ.45.02కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
* శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద. ఇన్ ఫ్లో 83,242, అవుట్ ఫ్లో 98,676 క్యూసెక్కులు
* జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత తురకా కిశోర్
* స్వచ్ఛత పక్వాడా అవార్డులు-2024లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న విశాఖ పోర్ట్
* పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గించాలని TDP కుట్ర: ఎంపీ అవినాశ్ రెడ్డి