News October 20, 2024
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: కిషన్ రెడ్డి

TG:కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడే వ్యాగన్స్ తయారవుతాయన్నారు. సికింద్రాబాద్ నడుస్తున్న వందేభారత్ రైళ్ల సంఖ్యను పెంచుతామన్నారు. ఈ రైళ్లలో స్లీపర్ కోచ్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామన్నారు. 2025 డిసెంబర్లోపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పున:ప్రారంభిస్తామన్నారు. సికింద్రాబాద్ నుంచి యాదాద్రి వరకు MMTS సర్వీసులు పొడిగిస్తున్నామన్నారు.
Similar News
News January 29, 2026
ఆవనూనెతో చర్మ సంరక్షణ

ఆవనూనె, కొబ్బరి నూనె కలిపి ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు పావుకప్పు ఆవనూనెలో రెండు చుక్కల రోజ్ ఆయిల్ని కలపాలి. దీనికి చెంచా బియ్యప్పిండి చేర్చి పేస్ట్లా చేయాలి. దీన్ని ఒంటికి రాసుకుని నలుగులా రుద్దుకోవాలి. ఇది సహజమైన స్క్రబ్లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
News January 29, 2026
మణిద్వీపం గురించి మీకు తెలుసా?

జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి నివసించే ప్రదేశమే మణిద్వీపం. ఇది భౌతిక ప్రపంచానికి అతీతంగా వైకుంఠం, కైలాసం కంటే ఉన్నతమైనదని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఇక్కడ చింతామణి గృహంలో కొలువై ఉండి విశ్వాన్ని పాలిస్తుంటారు. మణిద్వీపం అంటే అమ్మవారు కాదు. అది ఆమె నివాసం ఉండే ద్వీపం. ఇక్కడ అనంత సంపదలు, రత్నాలు, పారిజాత వనాలు ఉంటాయి. మణిదీప వర్ణన చదివితే దారిద్య్రం తొలగి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.
News January 29, 2026
రబీ జొన్న పంటలో ఎదుగుదల లోపించిందా?

పెరిగిన చలి తీవ్రత కారణంగా రబీలో నాటిన జొన్న పంట ఎదుగుదల కొన్నిచోట్ల లోపించినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి లీటరు నీటికి 19-19-19 మిశ్రమాన్ని 5 గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అలాగే జొన్న పంటలో ఒకవేళ కత్తెర పురుగును గుర్తిస్తే లీటరు నీటికి క్లోరాంట్రానిప్రోల్ 0.4ml లేదా స్పైనటోరమ్ 0.5ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


