News June 17, 2024
రైల్వే మంత్రి రీల్స్ చేయడంలో బీజీ: కాంగ్రెస్
బెంగాల్లో కాంచన్జంఘా, గూడ్స్ రైళ్ల ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ‘ఆయన రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రజల రక్షణ గురించి పట్టించుకునే సమయం లేదు’ అని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే విమర్శించారు. కాగా రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని, పనుల పునరుద్ధరణపైనే తమ దృష్టి ఉందని రైల్వే మంత్రి చెప్పుకొచ్చారు.
Similar News
News October 7, 2024
పండుగల నేపథ్యంలో ఉగ్రదాడులకు ప్లాన్!
దసరా, దీపావళి సందర్భంగా దేశంలో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ నిఘావర్గాలు తెలిపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా విదేశీయులే లక్ష్యంగా రాయబార కార్యాలయాల వద్ద ఈ దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
News October 7, 2024
రుణమాఫీ: మోదీకి మంత్రి తుమ్మల ఎదురు ప్రశ్న
తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ జరగలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పందించారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి, ప్రధాని మోదీకి కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని ఎదురు ప్రశ్న సంధించారు. మాఫీ పూర్తవగానే రైతు భరోసా వేస్తామన్నారు. తాము నిత్యం రైతుల్లో తిరుగుతున్నామని, వ్యతిరేకత ఉంటే తమకు నిరసన సెగ తగిలేదని గాంధీ భవన్లో అన్నారు.
News October 7, 2024
మాది మనసున్న మంచి ప్రభుత్వం: మంత్రి లోకేశ్
AP: అన్ని వర్గాల క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని మంత్రి లోకేశ్ చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఇప్పుడు వాటికి సాయం ₹10వేలకు పెంచామని పేర్కొన్నారు. దీనివల్ల 5,400 ఆలయాల్లో ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడిందన్నారు.