News January 29, 2025

మహాకుంభ్ రైళ్ల రద్దుపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ

image

మహాకుంభ్ స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే తాత్కాలికంగా నిలిపేసిందన్న వార్తలపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైతే అలాంటి ప్లానేమీ లేదని తెలిపింది. మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని వేర్వేరు స్టేషన్ల నుంచి ఈ ఒక్కరోజే 360 రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నామని వెల్లడించింది. మౌని అమావాస్య కావడంతో నేడు త్రివేణీ సంగమ స్థలి, వివిధ ఘాట్లు భక్తకోటితో నిండిపోవడం తెలిసిందే.

Similar News

News January 26, 2026

నేడు గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

image

గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. వర్కర్లందరూ యాప్‌ల నుంచి లాగౌట్ చేసి నిరసన చేపట్టనున్నట్లు గిగ్&ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలు నిలిచిపోవడం లేదా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

News January 26, 2026

ఈ 5 రోజులు ఎంతో పుణ్యమైనవి.. ఎందుకంటే?

image

మాఘ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు గల 5 రోజులను ‘భీష్మ పంచకాలు’ అంటారు. యుద్ధంలో గాయపడిన భీష్ముడు, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాతే తన ప్రాణాలను విడవాలని నిశ్చయించుకున్నారు. అందుకే సప్తమి నుంచి 5 రోజుల పాటు ఒక్కో ప్రాణాన్ని విడుస్తూ అష్టమి నాటికి సిద్ధమయ్యారు. ఈ 5 రోజులు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనవి. ఈ సమయంలో చేసే జపతపాలు అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం.

News January 26, 2026

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?

image

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోక్షజ్ఞ తొలి సినిమాను లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్‌తో రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.