News December 17, 2024

మళ్లీ వర్షం.. రెండో సెషన్ ఆలస్యం

image

బ్రిస్బేన్ టెస్టును వరుణుడు వదలట్లేదు. లంచ్ బ్రేక్ తర్వాత ఆట మొదలు కావాల్సి ఉండగా వర్షం మొదలైంది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మూడో టెస్టు తొలి రోజు నుంచి వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తూనే ఉంది. ఇవాళ నాలుగో రోజు కాగా, భారత్ 278 రన్స్ వెనుకంజలో ఉంది. క్రీజులో జడేజా(41), నితీశ్ రెడ్డి (7) ఉన్నారు. వర్షం తీవ్రత పెరగడం వల్ల రెండో సెషన్ ఆట మరింత ఆలస్యం కానుంది.

Similar News

News September 18, 2025

రేపు OTTలోకి ‘మహావతార్ నరసింహ’

image

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. రేపటి నుంచి Netflixలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

News September 18, 2025

పలు ఆలయాల బోర్డులకు ఛైర్మన్ల నియామకం

image

AP: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది.
1.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం(శ్రీశైలం)- P.రమేశ్ నాయుడు
2.శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం- కొట్టె సాయి ప్రసాద్
3.శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం(కాణిపాకం)- V.సురేంద్ర బాబు
4.శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం(ఇంద్రకీలాద్రి)- B.రాధాకృష్ణ
5.శ్రీ వేంకటేశ్వర ఆలయం(వాడపల్లి)- M.వెంకట్రాజు

News September 18, 2025

eAadhaar App.. ఇక మనమే అప్డేట్ చేసుకోవచ్చు!

image

ఆధార్ కార్డులో అప్‌డేట్స్ కోసం ఇక ఆధార్ సెంటర్లు, మీసేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం eAadhaar App తీసుకొస్తోంది. ఇందులో ఆన్‌లైన్‌లోనే పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడీ టెక్నాలజీ వల్ల డిజిటల్ ఆధార్ సేవలు సురక్షితంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నవంబర్‌లో యాప్ లాంచ్ చేసే అవకాశం ఉంది.