News July 7, 2024
హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం

హిమాచల్ ప్రదేశ్ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ధర్మశాల, పాలాంపూర్ ప్రాంతాల్లో ఏకంగా 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్, మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 150 రోడ్లను అధికారులు మూసేశారు. పర్యాటకులు ప్రస్తుతానికి రాష్ట్రానికి రావొద్దని సూచించారు. అత్యవసర సహాయక చర్యల బలగాలను కేంద్రం సిద్ధంగా ఉంచింది.
Similar News
News March 29, 2026
ఫోన్లో 100% ఛార్జింగ్ మంచిదేనా?

ఫోన్ను రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదని ఎక్స్పర్టులు హెచ్చరిస్తున్నారు. ‘100%’లో ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి ఉండటం వల్ల బ్యాటరీలపై అధిక వోల్టేజ్ ఒత్తిడి పడుతుందని అంటున్నారు. దీంతో బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుందని, 10-15 శాతం వరకు లైఫ్ పడిపోతుందని చెబుతున్నారు. 20-80% మధ్య ఛార్జింగ్ ఉంటే ఫోన్లు ఉత్తమంగా పని చేస్తాయంటున్నారు. అత్యవసర సమయాల్లో ఫుల్ ఛార్జ్తో వాడుకోవచ్చని సూచిస్తున్నారు.
News March 29, 2026
రేపటి మ్యాచ్కు విధ్వంసకర బ్యాటర్ దూరం

IPL: రేపు RRతో జరిగే మ్యాచ్కు విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ దూరమయ్యారు. ట్రైనింగ్లో పక్కటెముకల కండరాలు పట్టేయడంతో రేపటి మ్యాచ్ ఆడట్లేదని CSK హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. త్వరలోనే ఫిటెనెస్ సాధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తొలి రెండు మ్యాచులు అనంతరం బ్రెవిస్ అందుబాటులో ఉంటారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. రేపు గౌహతిలో ఈ 2 జట్ల మధ్య రాత్రి 7.30గంటలకు మ్యాచ్ జరగనుంది.
News March 29, 2026
జమ్మూకశ్మీర్ ఆటగాడిపై ప్రధాని ప్రశంసలు

జమ్మూకశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీని ప్రధాని మోదీ అభినందించారు. ‘ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత J&K జట్టు తొలి రంజీ ట్రోఫీని సాధించింది. ఈ సీజన్లో 60 వికెట్లు తీసిన ఆకిబ్ నబీ ప్రదర్శన గురించి దేశమంతటా చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో అతడి స్ఫూర్తితో మరెందరో ఆ ప్రాంతం నుంచి క్రీడల్లోకి వస్తారు’ అని ‘మన్ కీ బాత్’లో ప్రశంసించారు. కాగా IPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.8.4 కోట్లకు దక్కించుకుంది.


