News July 20, 2024
వర్షం.. వరద.. విలయం!

AP: వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో విలయం అంతాఇంతా కాదు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. కట్టలకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు దీవుల్ని తలపిస్తున్నాయి. కొండప్రాంతాల్లో చరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రకృతి విలయాన్ని చూసి ప్రజలు వణికిపోతున్నారు.
Similar News
News November 2, 2025
కార్తీక పౌర్ణమి ఏరోజు జరపాలంటే?

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి NOV 5న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నదీ స్నానాలకు 4:52 AM – 5:44 AM అనుకూలంగా ఉందన్నారు. పూజా కార్యక్రమాలను 7:58 AM – 9:00 AM జరపాలని సూచించారు. దీపారాధనకు సా.5:15 గంటల నుంచి రా.7:05 వరకు ఉత్తమమన్నారు. పౌర్ణమి రోజున 365 వత్తుల దీపం పెట్టి, శివకేశవులను పూజించి, ఉపవాసం ఉంటే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం.☞ కార్తీక పౌర్ణమి విశేషాలు, పూజ నియమాల కోసం <<-se_10013>>భక్తి<<>>.
News November 2, 2025
అవార్డును అభిమానులకు అంకితమిస్తున్నా: అల్లు అర్జున్

పుష్ప సినిమాలో నటనకు గాను ప్రతిష్ఠాత్మక అవార్డుకు అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ‘మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్-2025 ప్రకటించింది. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ తన అభిమానులకు అవార్డును అంకితం ఇస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నిరంతర ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.
News November 2, 2025
BREAKING: సుందర్ విధ్వంసం.. భారత్ విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సూర్య సేన 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో సుందర్ (23 బంతుల్లో 49*), జితేశ్ శర్మ (13 బంతుల్లో 22*) మెరుపులతో భారత్కు విజయాన్ని అందించారు. అంతకుముందు టిమ్ డేవిడ్, స్టాయినిస్ రాణించడంతో ఆస్ట్రేలియా 186 రన్స్ చేసింది. దీంతో 5 టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.


