News April 13, 2025

రాష్ట్రంలో మరికాసేపట్లో వర్షం

image

AP: రాష్ట్రంలో రాబోయే 3 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని APSDMA తెలిపింది. కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని పేర్కొంది.

Similar News

News April 15, 2025

Intermediate: సంస్కృతంతో తెలుగుకు దెబ్బేనా?

image

TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని రెండోభాషగా ప్రవేశపెట్టాలన్న ఇంటర్మీడియట్ అధికారుల నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల్లో 90% మంది విద్యార్థులు ఎక్కువ మార్కులు వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకుంటున్నారు. టెన్త్ వరకు తెలుగు చదివిన విద్యార్థులు ఇంటర్‌లో సంస్కృతాన్ని తీసుకుంటే తెలుగు భాషకు తీవ్ర నష్టం జరుగుతుందని విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News April 15, 2025

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బిగ్ షాక్?

image

TG: ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫీజులపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా 52% నుంచి 84% ఫీజులు పెంచాలని ప్రభుత్వంపై కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.

News April 15, 2025

కారు డోర్ లాకింగ్ మర్చిపోకండి!

image

TG: మీరు ఏ పనిలో ఉన్నా పిల్లల్ని ఓ కంట గమనిస్తూనే ఉండాలనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిన్న తన్మయశ్రీ(5), అభినయశ్రీ(4) కారులో ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మేనమామకు పెళ్లి కుదిరిందని వెళ్లిన పిల్లలు కారులో ఆడుకోవడానికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడూ కారును లాక్ చేసి ఉంచండి. ముఖ్యంగా చిన్న పిల్లలున్న పేరెంట్స్ ఇది మర్చిపోవద్దు.

error: Content is protected !!