News March 22, 2025
ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణమే

జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కురిసే నైరుతి వర్షపాతం వ్యవసాయానికి కీలకం. ఈ ఏడాది అది సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నిరుడు డిసెంబరులో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి బలహీనమైన లానినా, ఈ ఏడాది మరింత బలహీనమవుతుందని వారు పేర్కొన్నారు. నైరుతి వచ్చేనాటికి ఎల్నినో వస్తుందని అంచనా వేశారు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల మీదుగా చల్లగాలులు భారత్లోకి ప్రవేశించడం వల్ల నైరుతి వర్షాలు కురుస్తుంటాయి.
Similar News
News March 22, 2025
SCల విషయంలో జగన్ మడమ తిప్పారు: మందకృష్ణ

AP: దళితుల మధ్య మాజీ CM జగన్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. SCల విషయంలో ఆయన మాట తప్పారని, మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. ‘SC వర్గీకరణ విషయంలో చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. కానీ అప్పట్లో MP హోదాలో జగన్ SC వర్గీకరణకు సంతకం చేసి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. YCPలో మాలల ఆధిపత్యం కోసం మాదిగలను అణగదొక్కుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.
News March 22, 2025
IPL: ఇవాళ మ్యాచ్ జరుగుతుందా? లేదా?

ఈడెన్ గార్డెన్స్లో ఇవాళ రాత్రి జరిగే IPL ఓపెనింగ్ మ్యాచ్కు వర్షం ముప్పు లేదని కోల్కతా ఆక్యూవెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఇప్పటికే మబ్బులు తొలగి సూర్యుడు దర్శనమిస్తున్నాడు. సాయంత్రానికి కాస్త మబ్బులు పట్టినా పొడి వాతావరణమే ఉంటుంది. మ్యాచ్ జరిగినంతసేపూ.. అంటే రాత్రి 12 గంటల వరకూ వాన పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వర్షం పడితే కనీసం 5 ఓవర్ల ఆట అయినా ఆడించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.
News March 22, 2025
బయ్యా సన్నీ యాదవ్పై లుక్ఔట్ నోటీసులు

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్పై పోలీసులు లుక్ఔట్ నోటీసులిచ్చారు. అతడు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. అతడు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సన్నీపై సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.