News September 4, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది.

Similar News

News September 4, 2025

వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ

image

దేశ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారుతాయని PM మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. ‘వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలి. దేశీయ ఉత్పత్తులు వాడుతున్నామని అందరూ గర్వపడాలి. గాంధీజీ నినాదం కూడా స్వదేశీ.. దాన్ని అందరం పాటించాలి. స్వదేశీ డే, స్వదేశీ వీక్‌ను పండుగగా నిర్వహించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

News September 4, 2025

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ కన్నుమూత

image

ప్రపంచ ప్రఖ్యాత, ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియోగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్‌తో పేరొందారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.

News September 4, 2025

జాగృతిలో చీలికలు.. BRS కోసమే పనిచేస్తామంటున్న నేతలు

image

TG: బీఆర్ఎస్‌ను కవిత వీడటంతో దాని అనుబంధ సంస్థగా ఉన్న జాగృతిలో చీలికలు బయటపడుతున్నాయి. కవిత తమను నడిరోడ్డుపై పడేసిందని జాగృతి నేత రాజీవ్ సాగర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి తమదేనని, కేసీఆర్ చెప్పిందే చేస్తామని చెప్పారు. తెలంగాణ జాగృతి బోర్డు పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. దీనిపై జాగృతి ఫౌండర్ కవిత స్పందించాల్సి ఉంది.