News January 11, 2025

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఆదివారం భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.

Similar News

News October 21, 2025

MGUలో ఈ నెల 22న ప్లేస్మెంట్ డ్రైవ్: డా. వై ప్రశాంతి

image

MGUలో ఈ నెల 22న ప్లేస్మెంట్ డ్రైవ్ ఉదయం 9:30 గంటలకు సెమినార్ హాల్ ఆర్ట్స్ బ్లాక్ నందు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ Dr.Y. ప్రశాంతి తెలిపారు. Franqulin Tech, హైదరాబాద్ సంస్థ వారి సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో IT, Non-IT సంస్థలు పాల్గొంటాయి. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌కి UG, PG, B.Tech విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News October 21, 2025

TODAY HEADLINES

image

☞ దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు
☞ INS విక్రాంత్ పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది: మోదీ
☞ TG: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్
☞ AP: ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు
☞ రాష్ట్రాలు పోటీపడితేనే భారత్ గెలుస్తుంది: మంత్రి లోకేశ్
☞ కూటమి ప్రభుత్వ పాలనలో ఒక్క దీపమైనా వెలిగిందా: జగన్

News October 21, 2025

సరిహద్దుల్లో 120 మంది టెర్రరిస్టులు?.. ఆర్మీ హైఅలర్ట్‌

image

జమ్మూకశ్మీర్‌లో LoC వెంబడి ఇండియన్ ఆర్మీ హైఅలర్ట్ ప్రకటించింది. పాక్ దళాలు, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు పెరిగినట్లుగా గుర్తించింది. 120 మంది సాయుధ ఉగ్రవాదులు ఎల్వోసీ వెంబడి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని మల్టీ ఏజెన్సీల ద్వారా ఇన్‌పుట్స్ అందినట్లు సమాచారం. దీపావళి నేపథ్యంలో తాము పూర్తి అలర్ట్‌గా ఉన్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఆర్మీ వర్గాలు తెలిపాయి.