News September 23, 2024
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, భువనగిరి, సూర్యాపేటలో మోస్తరు వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News October 28, 2025
ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభమేంటి?

కలుపు నివారణలో మల్చింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. కలుపు కట్టడి జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుంది. కూరగాయల సాగుకు ఇది అనుకూలం. మల్చింగ్ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయ్యాక దున్నాల్సిన అవసరం లేకుండా పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.
News October 28, 2025
BREAKING: మచిలీపట్నానికి 160km దూరంలో ‘మొంథా’

AP: ‘మొంథా’ తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలినట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 160KM, కాకినాడకు 240KM, విశాఖపట్నానికి 320KM దూరంలో కేంద్రీకృతమైనట్లు వివరించింది. తుఫాను ప్రభావాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.
News October 28, 2025
10లక్షల మందికి యోగా గురువు ‘నానమ్మల్’

యోగాతోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన నానమ్మల్ అనేక పురాతన యోగా శాసనాలను భావితరాలకు పంచారు. 1972లో యోగాసెంటర్ ప్రారంభించి 10L మందికిపైగా యోగా నేర్పారు. వారు దేశవిదేశాల్లో యోగాగురువులుగా స్థిరపడ్డారు. ఆమె చేసిన కృషికిగాను 2016లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి, 2019లో పద్మశ్రీతో సత్కరించింది. 99 ఏళ్ల వయసులో మరణించిన ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
✍️ ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.


