News October 3, 2024
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో HYDతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల, NRPT, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలో ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
Similar News
News November 3, 2025
అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.
News November 3, 2025
ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని కర్నూలు, తిరుపతిలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. యాదాద్రిలోని చౌటుప్పల్లో 6.1cm, నిజామాబాద్లోని మంచిప్పలో 5.4cmల వర్షపాతం నమోదైంది.
News November 3, 2025
రోజూ శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే..

శివలింగానికి రోజూ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అభిషేకం ఆరోగ్యంతో పాటు, బలం, యశస్సు, కీర్తిని ప్రసాదిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ‘పెరుగు చాలా శుభప్రదమైనది. పౌష్టికపరమైనది. ఈ అభిషేకం భక్తుల శారీరక, మానసిక రోగాలను మాయం చేస్తుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరిగి, మంచి వ్యక్తిత్వంతో జీవించడానికి శివానుగ్రహం లభిస్తుంది’ అంటున్నారు.


