News November 1, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News February 2, 2026

కరోండా మొక్కలతో పంటకు రక్షణ, ఆదాయం

image

పంట రక్షణకు నేడు ఇనుప వైర్ ఫెన్స్, కాంక్రీటు స్తంభాలు వేయడానికి చాలా ఖర్చవుతుంది. అయితే పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది ‘కరోండా’. వీటినే వాక్కాయ మొక్కలు అంటారు. ఇవి చిన్న పొద రూపంలో పెరుగుతాయి. వీటి కాండం, కొమ్మలు ముళ్లతో నిండి పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తాయి. ఈ మొక్కలకు ఉండే కాయలతో రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. కరోండాను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News February 2, 2026

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

News February 2, 2026

శత్రు విజయం సాధించాలంటే ఏ దీపం?

image

శత్రువులపై విజయం సాధించాలన్నా, ఇతరుల నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించాలన్నా మినప పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఈ దీపానికి దుష్ట శక్తులను, నరదిష్టిని తొలగించే శక్తి ఉంది. కుజ దోషం లేదా జాతకంలో రాహు-కేతు ప్రభావం వల్ల కలిగే ఆటంకాలను ఇది నివారిస్తుంది. భయం, ఆందోళనలు ఉన్నవారు మినప పిండి దీపాన్ని వెలిగించడం వల్ల ధైర్యం పొందుతారు. ఇది రక్షణ కవచంలా పనిచేసి కార్యసిద్ధిని కలిగిస్తుంది.