News May 21, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.
Similar News
News January 18, 2026
అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం: కలెక్టర్

గుమ్మలక్ష్మీపురం(M) వనకాబడిలో జీలుగుకళ్ళు తాగి అస్వస్థతకు గురైన వారికి చికిత్సను అందిస్తున్నామని వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని కురుపాం సీహెచ్సీలో వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు. జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
News January 18, 2026
సింహాచలంలో ఇవాళ 6గంటలు వరకు మాత్రమే దర్శనం

సింహాచలం వరహాలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జనవరి 18వ తేదీ దర్శన వేళలో మార్పులు చేశారు. జనవరి 18న కొండ కింద గల వరాహ పుష్కరిణలో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనవరి 18న ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు ఈవో సుజాత శనివారం తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.తెప్పోత్సవం తరువాత స్వామి వారి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
News January 18, 2026
సింహాచలంలో ఇవాళ 6గంటలు వరకు మాత్రమే దర్శనం

సింహాచలం వరహాలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జనవరి 18వ తేదీ దర్శన వేళలో మార్పులు చేశారు. జనవరి 18న కొండ కింద గల వరాహ పుష్కరిణలో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనవరి 18న ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు ఈవో సుజాత శనివారం తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.తెప్పోత్సవం తరువాత స్వామి వారి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.


