News February 21, 2025
రాజాసింగ్ ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్ల తొలగింపు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లను మెటా తొలగించింది. ఎమ్మెల్యే ప్రసంగాలు ద్వేషపూరితంగా ఉన్నాయని ‘ఇండియా హేట్ ల్యాబ్’ నివేదిక ఇచ్చింది. దీంతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ ఫేస్బుక్ పేజీల్లో 10లక్షలకు పైగా మెంబర్స్, ఇన్స్టాలో లక్షా55వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీనిపై స్పందించిన రాజాసింగ్ హిందువులే టార్గెట్గా సెలక్టెడ్ సెన్సార్షిప్ నడుస్తుందని ఆరోపించారు
Similar News
News September 17, 2025
పాక్ ‘ఫేక్ ఫుట్బాల్ జట్టు’ను వెనక్కి పంపిన జపాన్

ఫుట్బాల్ ఆటగాళ్లమంటూ పాక్ నుంచి తమ దేశానికి వచ్చిన ఫేక్ ప్లేయర్లను జపాన్ వెనక్కి పంపింది. మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఫేక్ ఫుట్బాల్ జట్టును సృష్టించి 22 మందిని జపాన్కు పంపించాడు. అయితే అక్రమంగా వచ్చిన వారిని అధికారులు హెచ్చరించి వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. వకాస్ను అరెస్ట్ చేసి విచారించగా 2024లోనూ ఇదే పద్ధతిలో పంపినట్లు తెలిపాడు.
News September 17, 2025
24న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

AP: డిసెంబర్ కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 24న ఉదయం 10గంటలకు విడుదల కానున్నాయి. మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. భక్తులు దళారులను నమ్మవద్దని, <
News September 17, 2025
నటికి రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్?

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హయ్యెస్ట్ బడ్జెట్తో రూపొందనున్న ఓ సినిమాలో నటించేందుకు ఆమెకు ఏకంగా రూ.530కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇది జరిగితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా సిడ్నీ నిలువనున్నారు.