News July 1, 2024
కేబినెట్లోకి రాజగోపాల్, దానం: దామోదర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719837195434-normal-WIFI.webp)
TG: త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండొచ్చని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు TPCC చీఫ్ ఎంపికపైనా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అతిత్వరలో చీఫ్ను ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News July 3, 2024
DCM పదవి నేను కోరుకోలేదు: పవన్ కళ్యాణ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720010160462-normal-WIFI.webp)
AP: డిప్యూటీ సీఎం పదవిని తాను కోరుకోలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం వారాహి సభలో ఆయన మాట్లాడారు. ‘YCP నేతలు నన్ను అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో చూస్తాం అన్నారు. కానీ ఆ వ్యాఖ్యలను పిఠాపురం ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని వెళ్లేలా చేశారు. పిఠాపురం విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News July 3, 2024
రేవంత్, చంద్రబాబు గురుశిష్యులు కాదు: భట్టి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720009010864-normal-WIFI.webp)
TG: సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు గురుశిష్యులు కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వారిద్దరూ సహచరులు మాత్రమేనని మీడియాతో చిట్చాట్ సందర్భంగా పేర్కొన్నారు. ‘ఎవరూ అవగాహన లేని మాటలు మాట్లాడొద్దు. ఈ విషయం గురించి రేవంత్ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. వారిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. సహచరులు. అంతే’ అని పేర్కొన్నారు.
News July 3, 2024
అన్అకాడమీలో మరోసారి ఉద్యోగాల కోత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720007714283-normal-WIFI.webp)
వివిధ విభాగాలకు చెందిన 250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రముఖ ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ ప్రకటించింది. ఆర్థికభారం సహా వ్యాపారాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ తొలగింపు చేపట్టినట్లు తెలిపింది. కాగా ఈ సంస్థ ఇలా లేఆఫ్స్ ప్రకటించడం ఇది మూడోసారి. గత ఏడాది మార్చిలో సుమారు 380 మందిని తొలగించగా, 2022 ఏప్రిల్లో దాదాపు వెయ్యి మందిని తప్పించింది.