News December 12, 2024

నేటి నుంచి రాజమండ్రి- ఢిల్లీ విమాన సర్వీసులు

image

AP: రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి నేడు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 6E 364 ఇండిగో విమాన సర్వీసు నేటి నుంచి రోజూ రాకపోకలు సాగించనుంది. ఈ విమానం ఉదయం 6.30కు ఢిల్లీ నుంచి మధురపూడి వచ్చి, ఇక్కడి నుంచి ఉదయం 9.30కు బయలుదేరి వెళ్తుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా, తాజా సర్వీసుతో ఉభయ గోదావరి ప్రజలు సంతోష పడుతున్నారు.

Similar News

News November 16, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

*స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని CM రేవంత్‌ను R.కృష్ణయ్య కోరారు. నేడు రాష్ట్రంలో BC న్యాయసాధన దీక్షలు చేయనున్నారు.
*BRS కార్యకర్తలపై తాము దాడి చేశామని KTR చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని జూబ్లీహిల్స్ MLAగా ఎన్నికైన నవీన్ యాదవ్ తెలిపారు.
*సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ACB మరోసారి దాడులు చేసింది. సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News November 16, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఎర్ర చందనం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు డ్రోన్లతో పహారా కాస్తున్నట్లు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు DSP మహేంద్ర తెలిపారు. మరో 8 మంది నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
* గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు ఐదేళ్ల తర్వాత విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

News November 16, 2025

మరో అల్పపీడనం.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఈనెల 17, 18 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.