News March 12, 2025
బోరుగడ్డ అనిల్పై హైకోర్టుకు రాజమహేంద్రవరం పోలీసుల లేఖ

AP: మధ్యంతర బెయిల్ గడువు మంగళవారంతో ముగిసినా బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోలేదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు రాష్ట్ర హైకోర్టుకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు లేఖ రాశారు. రిమాండ్ ముద్దాయిగా ఉన్న అనిల్పై తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. తన తల్లికి వైద్య చికిత్స కోసమని చెప్పి అనిల్ మధ్యంతర బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 12, 2025
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి.
News March 12, 2025
నా ఒక్కడితో మొదలై శక్తిమంతంగా ఎదిగింది: YS జగన్

AP: YSR ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన YCPని భుజాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులకు YS జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ఒక్కడితో మొదలైన YCP శక్తిమంతమైన పార్టీగా 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్-1గా నిలపడమే లక్ష్యం’ అని ట్వీట్ చేశారు.
News March 12, 2025
ఇండియాకు ICC ఫేవర్గా ఉంటోంది: వెస్టిండీస్ లెజెండ్

భారత్కు అనుకూలమయ్యేలా ICC నిర్ణయాలు ఉంటున్నాయని WI లెజెండరీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ అన్నారు. CTలో IND మ్యాచులన్నీ ఒకే వేదికపై నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ‘గత T20 WCలోనూ INDకి ఫేవర్గా నడుచుకున్నారు. సెమీస్ వెన్యూ వారికి ముందే తెలిసింది. నా దృష్టిలో ICC అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు. క్రికెట్లో నో బాల్స్, వైడ్లు ఉండకూడదని ఇండియా కోరితే ICC ఆ రూల్ను కూడా తీసుకొస్తుంది’ అంటూ విమర్శించారు.