News March 21, 2024

జపనీస్ యానిమేపై రాజమౌళి దృష్టి

image

జపాన్ పర్యటనలో ఉన్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి యానిమేపై దృష్టిసారించారు. బాగా ఫేమస్ అయిన జపనీస్ యానిమే గురించి అక్కడి నిపుణులతో చర్చించారు. ‘అద్భుతమైన జపనీస్ యానిమే ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి నేను ఎప్పుడూ ఆసక్తిగా ఉంటా. యానిమే గురించి నాకు వివరించిన రుయి కురోకి-సాన్, కజుటో నకాజవా-సాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సృజనాత్మక చర్చలను పూర్తిగా ఆస్వాదించా’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News April 2, 2025

రైలులో ప్రయాణించే ముందు ఇది తెలుసుకోండి!

image

రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే లగేజీ పరిమితులను నిర్దేశించింది. ప్రయాణ తరగతిని బట్టి లగేజీ బరువుపై రుసుము వసూలు చేస్తారు. ఒక్కరి దగ్గర AC ఫస్ట్ క్లాస్‌లో 70KGS, AC 2టైర్‌లో 50KGS, AC 3టైర్‌& స్లీపర్‌లో 40KGS, జనరల్ బోగీలో 35 కేజీల బరువు కంటే మించకూడదు. ఈ పరిమితిని మించి తీసుకెళ్లాలనుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. SHARE IT

News April 2, 2025

ముంబైని వదిలి గోవాకు?

image

ముంబై యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. వ్యక్తిగత కారణాలతో వచ్చే సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్లో ముంబైని వదిలి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు NOC కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు ఈమెయిల్ చేసినట్లు తెలుస్తోంది. జైస్వాల్ గోవా జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

News April 2, 2025

బీసీల డిమాండ్‌ను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు: సీఎం

image

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. బీసీల లెక్క తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని కోర్టులు చెప్పాయని, అందుకే బీసీ కులగణన చేపట్టామని చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయబద్ధమైనదని, దీన్ని బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.

error: Content is protected !!