News October 30, 2024

రాజమౌళి కొత్త పోస్ట్.. హైప్ ఎక్కించు అంటున్న MB ఫ్యాన్స్

image

SSMB29 కోసం లోకేషన్ వేటలో ఆఫ్రికాలో ఉన్న దర్శకుడు రాజమౌళి మరో పోస్ట్ చేశారు. సింహాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘దీని పేరు బాబ్ జూనియర్. సెరెంగెటి(ఆఫ్రికాలోని ఓ ప్రాంతం)కి రాజు. ఈ ఫొటోను క్రిస్ ఫాలోస్ తీశారు’ అని రాసుకొచ్చారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తూ హైప్ ఎక్కించు ఇంకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా క్రిస్ ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్.

Similar News

News January 10, 2026

APMSRB: 97 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

AP: వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 97 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యసేవల నియామక బోర్డు(APMSRB) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో క్లినికల్, నాన్-క్లినికల్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు ఈ నెల 12వ తేదీ నుంచి 27వ తేదీ రాత్రి 11.59గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News January 10, 2026

రైతులకు రూ.2,000.. ఫిబ్రవరిలోనే!

image

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000లను 3 విడతలుగా కేంద్రం జమ చేస్తోంది. ఇప్పటివరకు 21 విడతలు పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 22వ విడత నిధులు ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి E-కేవైసీ, ఆధార్, బ్యాంక్ వివరాలు తప్పనిసరి చేశారు. లోపాలు ఉంటే బెనిఫిషరీ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉండటంతో రైతులు వివరాలను సరిచూసుకోవాలి.

News January 10, 2026

ఈ పథకం కింద ఏ పరికరాలను అందిస్తారు?

image

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, యాంత్రీకరణను ప్రోత్సహించి అధిక దిగుబడులను సాధించడమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లను ప్రభుత్వం రాయితీగా అందించనుంది. దీని వల్ల పంట నాట్లు, కోత సమయంలో కూలీల కొరత, ఖర్చు తగ్గి రైతులకు ఎంతో లబ్ధి కలగనుంది.