News February 23, 2025
SSMB29పై ఏప్రిల్లో రాజమౌళి ప్రెస్మీట్?

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో SSMB29 మూవీ షూటింగ్ ఇప్పటికే కొనసాగుతోంది. ఈ క్రమంలో దర్శకధీరుడు ఏప్రిల్లో ప్రెస్ మీట్ నిర్వహించి సినిమాకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడిస్తారని సమాచారం. మూవీ బడ్జెట్, నటీనటుల వివరాలు, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? రిలీజ్ ఎప్పుడు? లాంటి విషయాలు వివరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News February 23, 2025
BJPని గెలిపిస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది: R.కృష్ణయ్య

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని గ్రాడ్యుయేట్లు, టీచర్లను ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ప్రెస్మీట్లో మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయి. ఇటీవల ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ఇవ్వాలి. రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. ఓటర్లు చిన్న చిన్న ప్రలోభాలకు లొంగవద్దు’ అని సూచించారు.
News February 23, 2025
‘రాజా సాబ్’ మూవీపై క్రేజీ న్యూస్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజా సాబ్’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాప్ మోస్ట్ కమెడియన్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిశోర్, సప్తగిరి, గెటప్ శ్రీను, యోగిబాబు, వీటీవీ గణేశ్ తదితరులను డైరెక్టర్ మారుతి తీసుకున్నట్లు టాక్. వీరి కోసం స్పెషల్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది.
News February 23, 2025
ఢిల్లీ అసెంబ్లీలో LOPగా ఆతిశీ

ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం ఆతిశీ ఎన్నికయ్యారు. ఆప్ లెజిస్లేటివ్ మీటింగ్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు. దీంతో LOPగా ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె నిలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 22 సీట్లు గెలిచింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వంటి కీలక నేతలు ఓడిపోయిన సంగతి తెలిసిందే.