News March 4, 2025
ఆధిక్యంలో పేరాబత్తుల రాజశేఖరం

AP: తూ.గో-ప.గో జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 28 టేబుళ్లలో జరుగుతున్న కౌంటింగ్లో నాల్గవ రౌండ్ పూర్తయ్యే నాటికి 1,02,236 ఓట్లు చెల్లుబాటు అయినట్లు గుర్తించారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 64,405 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు 23,252 ఓట్లు పొందారు. 41,153 ఓట్ల మెజార్టీతో రాజశేఖరం ఉండగా, ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Similar News
News November 22, 2025
సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.
News November 22, 2025
తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్ను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ENG బౌలర్లను ఓపెనర్ హెడ్ ఊచకోత కోశారు. కేవలం 83 బంతుల్లోనే 123 రన్స్ బాదారు. లబుషేన్ 51* రన్స్తో రాణించారు.
స్కోర్స్: ENG- 172, 164.. AUS- 132, 205/2
News November 22, 2025
iBOMMA రవిని పోలీస్ శాఖలో నియమించుకోవాలి:CVL

iBOMMA రవిని అందరూ రాబిన్హుడ్లా చూస్తున్నారని సీనియర్ అడ్వొకేట్, నటుడు CVL నరసింహారావు చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడితే సినిమాల్లో ఒకరు పుట్టుకొస్తాడని, అదే తీరులో రవి వచ్చాడని తెలిపారు. నిర్మాతలు తప్ప అతనిపై సామాన్యులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఎంతో నాలెడ్జ్ ఉన్న రవిని శిక్షించడం కంటే పోలీస్ శాఖలో సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


