News December 10, 2024
పాక్లో తొలి హిందూ పోలీస్గా రాజేందర్

పాకిస్థాన్లో తొలి హిందూ పోలీస్ అధికారిగా రాజేందర్ మేఘ్వార్ నిలిచారు. సింధ్ ప్రావిన్స్లోని బదిన్కు చెందిన రాజేందర్ అక్కడి CSS(సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్)ఎగ్జామ్లో ఉత్తీర్ణులయ్యారు. ట్రైనింగ్ అనంతరం ఆయన ఫైసలాబాద్లో ASPగా బాధ్యతలు చేపట్టారు. రాజేందర్తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే యువతి CSS ఎగ్జామ్ క్లియర్ చేశారు. పాక్లోని మైనార్టీల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
Similar News
News October 18, 2025
యమ దీపం ఎలా పెట్టాలంటే..?

ధన త్రయోదశి నాడు వెలిగించే యమ దీపంలో నాలుగు వత్తులు, నాలుగు ముఖాలుగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఈ దీపం కోసం.. నువ్వుల నూనె/ ఆవ నూనెను ఉపయోగించాలి. దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో ఉంచాలి. కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో, కష్టాల నుంచి విముక్తి పొందాలని యమధర్మరాజును ప్రార్థించాలి. ఈ దీపదానం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నిలిచి, అకాల మరణ భయం తొలగిపోతుంది’ అని అంటున్నారు.
News October 18, 2025
BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

తెలంగాణలో బీసీల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లతో రాజ్యమేలుతారనుకుంటే బంద్తో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టడం, హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే విధించడంతో తమ ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారని బీసీలు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ పరిణామానికి కారణమెవరు? Comment
News October 18, 2025
అత్యంత భారీగా తగ్గిన వెండి ధరలు

ధన త్రయోదశి వేళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండిపై ఏకంగా రూ.13వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,910 తగ్గి రూ.1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.