News October 4, 2024
అభిమానులకు రజినీకాంత్ సందేశం
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, సహచర నటులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మీ ప్రార్థనలే తనకు శ్రీరామరక్షగా నిలిచాయని పేర్కొన్నారు. కాగా రజినీ నటించిన ‘వేట్టయన్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News October 4, 2024
టాస్ ఓడిన టీమ్ ఇండియా
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్: షఫాలీ, స్మృతి, హర్మన్, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, అరుంధతి, రేణుకా సింగ్, ఆశా.
కివీస్: బేట్స్, ప్లిమ్మర్, అమేలియా కెర్, డివైన్(సి), హాలిడే, గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, మెయిర్, ఈడెన్ కార్సన్, లీ తహుహు.
News October 4, 2024
భారీ ఎన్కౌంటర్.. 30 మంది మావోలు మృతి
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.
News October 4, 2024
తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రికి ఆయన కొండపైనే బస చేయనున్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.