News April 14, 2025
‘రాజీవ్ యువ వికాసం’.. నేడే చివరి తేదీ.. గడువు పొడిగిస్తారా?

TG: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అయితే వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు. గడువును ఈనెలాఖరు వరకు లేదా మరో 10 రోజులపాటు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకు 14 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం.
Similar News
News December 21, 2025
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL) 30 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్మీ/నేవీ/IAFలో పనిచేసిన అభ్యర్థులు DEC 22 నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 43ఏళ్లు. నెలకు జీతం రూ.20,000-రూ.81,000 చెల్లిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nlcindia.in/
News December 21, 2025
వారంలో రూ.16,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం(DEC 14-20) స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.1,34,180కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరగడంతో రూ.1,23,000గా ఉంది. అయితే కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.16,000 పెరిగి రూ.2,26,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.
News December 21, 2025
రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్!

AP: త్వరలోనే నిరుద్యోగ యువతకు శుభవార్త రానుంది. కూటమి ప్రభుత్వం జనవరిలో <<18617902>>జాబ్ క్యాలెండర్<<>> విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్యా శాఖలలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. మరో వారంలో ఖాళీల తుది లెక్క తేలనుంది.


