News April 14, 2025
‘రాజీవ్ యువ వికాసం’.. నేడే చివరి తేదీ.. గడువు పొడిగిస్తారా?

TG: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అయితే వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు. గడువును ఈనెలాఖరు వరకు లేదా మరో 10 రోజులపాటు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకు 14 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం.
Similar News
News December 14, 2025
సర్పంచ్ ఎన్నికలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1,500కు పైగా, BRS 800, BJP 200 సీట్లలో విజయం సాధించారు. ఇతరులు 440 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. అటు కేటీఆర్, హరీశ్ రావు సొంత నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలో BRS అత్యధిక స్థానాలు గెలుచుకుంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
News December 14, 2025
జైస్వాల్ రావాల్సిన టైమ్ వచ్చిందా?

టీమ్ ఇండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ టీ20ల్లో అదరగొడుతున్నారు. గత 13 ఇన్నింగ్సుల్లో అతడి స్కోర్లు 67, 6, 75, 51, 74, 49, 70*, 13, 34, 50, 36, 29, 101గా ఉన్నాయి. దీంతో అతడిని నేషనల్ టీమ్కు సెలెక్ట్ చేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. వరుసగా విఫలం అవుతున్నా గిల్కు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ COMMENT?
News December 14, 2025
సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక..

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చిన్నగోని కాటంరాజు అనే వ్యక్తి BRS మద్దతుతో తొలి విడతలో మునుగోడు మండలం కిష్టాపురం గ్రామ సర్పంచ్గా పోటీ చేశారు. తప్పకుండా గెలుస్తానని నమ్మకం ఉన్నప్పటికీ 251 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో డిప్రెషన్కు గురైన ఆయన ఇవాళ గుండెపోటుతో మరణించారని కుటుంబసభ్యులు వెల్లడించారు.


