News October 15, 2024

దామగుండం బయల్దేరిన రాజ్‌నాథ్ సింగ్, రేవంత్

image

TG: వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో కాసేపట్లో రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి దామగుండం బయల్దేరారు.

Similar News

News October 18, 2025

కోతుల బెడద.. గ్రామస్థులు ఏం చేశారంటే..

image

TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కూరెళ్లలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సమస్యను తామే పరిష్కరించుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కరీంనగర్‌ నుంచి కోతులను బంధించే బృందాన్ని రప్పించాలని, ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.300 చెల్లించాలని గ్రామస్థులు సమావేశమై నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి రూ.1,000 చొప్పున ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించారు.

News October 18, 2025

జైనుల దీపావళి ఎలా ఉంటుందంటే..?

image

జైనులు దీపావళిని ఆధ్యాత్మిక దినంగా పరిగణిస్తారు. ఈరోజునే మహావీరుడు నిర్యాణం పొందిన రోజుగా భావిస్తారు. ఆయన దివ్యజ్యోతికి ప్రతీకగా దీపాలను వెలిగిస్తారు. ఆ కాంతిని మహావీరునికి అంకితం చేస్తారు. ఆయన జ్ఞాన బోధనలను, చూపిన మోక్షమార్గాన్ని స్మరించుకుంటారు. దీపావళిని వారు అంత పవిత్రంగా భావిస్తారు కాబట్టే.. వ్యాపారాలను ఈ శుభదినం నుంచి ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. నూతన సంవత్సరంగా జరుపుకొంటారు.

News October 18, 2025

డిమాండ్లు తీరుస్తాం… వైద్యులు విధుల్లో చేరాలి: ప్రభుత్వం

image

AP: PHCల వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ సూచించారు. PG మెడికల్ ఇన్‌సర్వీస్ కోటాను ఈఏడాది అన్ని కోర్సుల్లో కలిపి 20% అమలుకు GO ఇస్తామని వారితో చర్చల్లో వెల్లడించారు. ట్రైబల్ అలవెన్సు తదితర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే PGలో 15% కోటా 3ఏళ్లు ఇవ్వాలని సంఘం నేతలు కోరగా దీనిపై ప్రభుత్వం నవంబర్లో నిర్ణయం తీసుకుంటుందని గౌర్ చెప్పారు.